సదావర్తి భూముల కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు చుక్కెదురైంది. ఈ కేసును విచారిస్తున్న రాష్ట్రోన్నత న్యాయస్థానం సదావర్తి భూములను మళ్లీ వేలం నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ పత్రికల్లో ప్రకటన ఇచ్చి ఆరు వారాల్లోగా వేలం పక్రియను నిర్వహించాలని న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరోసారి వేలంలో పాల్గొనవచ్చని రాష్ట్రోన్నత న్యాయస్థానం సూచించింది. ఆయన చెల్లించిన రూ. 27.44 కోట్ల రూపాయలను బేస్ ప్రైస్ గా నిర్ణయించి వేలం నిర్వహించాలని అదేశించింది. ఈ వేలంలో పాల్గోనేందుకు ఎవరూ ముందుకు రాని పక్షంలో ఆ భూములను రామకృష్ణా రెడ్డికే చెందుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.
గతంలోనే చెన్నైలోని సదావర్తి భూములకు సంబంధించి రూ.22.50కోట్లకు ఓ వ్యక్తికి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలం నిర్వహించింది. అయితే ప్రభుత్వం అతితక్కువ ధరకు భూములను
విక్రయించిందంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో తాము వేసిన వేలంకంటే మరో రూ.5కోట్లు ఎక్కువగా ఇచ్చినట్లైతే రామకృష్ణారెడ్డికి ఆ
భూములను అప్పగించడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి భూములను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని ఉద్దేశపూర్వకంగానే తక్కువ ధరకు వేలం వేశారని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ముందుగా వీటిపై హకోర్టును అశ్రయించిన నేపథ్యంలో.. ఇవాళ తాజాగా ఈ భూములను బహిరంగ వేలం వేయాలంటూ ఆలిండియా బ్రాహ్మణ సంఘం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన రాష్ట్రోన్నత న్యాయస్థానం జాతీయ పత్రికల్లో ప్రకటన ఇచ్చి ఆరువారాల్లోగా బహిరంగ వేలం వేయాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో మరోమారు సదావర్తి భూములను వేలం వేయడానికి అంద్రప్రదేశ్ ప్రభుత్వం సన్నధం అయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more