మాదక ద్రవ్యాల వ్యవహారంకు తెలంగాణనే కేంద్ర బిందువు అని తేలటంతో ప్రభుత్వం ఈ ఇష్యూపై చాలా సీరియస్ గా ఉంది. వ్యవహారంలో ఉంది ఎవరైనా సరే వారిని విచారించాల్సిందేనంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశాడు. ఈ నేపథ్యంలో ఇందులో టీఆర్ఎస్ నేతల హస్తం కూడా ఉందంటూ సంచలన ఆరోపణలే చేశాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ఆయన చేసిన ట్వీట్ కలకలమే రేపింది.
"తెలంగాణలో భారీ డ్రగ్స్ స్కామ్ జరిగింది. ఇందులోని కొందరు ప్రముఖులకు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలతో స్నేహం ఉంది. వారి ప్రమేయమూ ఇందులో ఉంది. ఇక వారిని ప్రాసిక్యూట్ చేస్తారో లేక వదిలివేస్తారో వేచి చూడాలి. చూస్తాను" అని ఈ ఉదయం ట్వీట్ పెట్టాడు. గతంలోనూ ఫేక్ సైట్లతో ముస్లిం యువకులను తెలంగాణ పోలీసులు ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదానికి తెరలేపాడు. ఇప్పుడు అధికార పార్టీపై చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతాయో చూడాలి.
Huge Drug Scam in Telangana. Influential friends of TRS heir apparent involved. Let's see if they would be saved or prosecuted. Let's see.
— digvijaya singh (@digvijaya_28) July 20, 2017
ఎట్టకేలకు నేర్చుకున్నాడు...
డ్రగ్స్ దందాలో టీఆర్ఎస్ నేతలు ఇరుక్కున్నారని డిగ్గీ రాజా చేసిన వ్యాఖ్యలపై ఐటీ మంత్రి కేటీఆర్ జెట్ స్పీడ్ తో స్పందించాడు. దిగ్విజయ్ పూర్తిగా గతి తప్పారని, గౌరవప్రదంగా ఆయన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని సలహా ఇచ్చాడు. తన వయసుకు తగ్గ పనులు చేసుకోవాలని సూచించిన కేటీఆర్, ఎట్టకేలకు 'తెలంగాణ' స్పెల్లింగ్ ను ఆయన నేర్చుకున్నారని, అందుకు సంతోషమని సెటైర్ వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు. కాగా, గతంలో దిగ్విజయ్ చేసిన ట్వీట్ లో తెలంగాణ స్పెల్లింగ్ తప్పుగా ఉండటంతో కేటీఆర్ ఈ సెటైర్ వేశాడు.
You've completely lost it sir. Time to retire gracefully & do something worth your age. Glad that you've finally learnt to spell 'Telangana' https://t.co/1lozaMpEN6
— KTR (@KTRTRS) July 20, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more