సీనియర్ న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పీఎన్ భగవతి కన్నుమూశారు. 96 ఏళ్ల భగవతి కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గుజరాత్ లో జన్మించిన ప్రఫుల్లాచంద్ర నట్వర్ లాల్ భగవతి ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీ నుంచి పట్టా పుచ్చుకున్నాడు. 1967లో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1973 లో సుప్రీం కోర్టు జడ్జిగా, 1985లో 17వ సుప్రీం చీఫ్ జస్టిస్ గా ఆయన నియమితులయ్యారు. న్యాయవ్యవస్థలో మైలురాయిగా చెప్పుకునే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్)ను ప్రారంభించించి ఈయనే. పేదల తరపున గొంతుకను వినిపించేందుకు మూడో వ్యక్తికి ఆస్కారం ఇస్తూ ఆయన ప్రతిపాదనలు చేసి అమలుపరిచారు. అంతేకాదు ఎమర్జెన్సీ సమయంలో ఆర్టికల్ 4ను సమర్థించిన న్యాయమూర్తి ఆయనే కావడం విశేషం. మినర్వా మిల్స్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనంలో 42వ రాజ్యాంగ సవరణను సమర్థించిన ఒకే ఒక్క న్యాయమూర్తి జస్టిస్ భగవతి.
వీటితోపాటు కీలకమైన మేనకా గాంధీ కేసులో తీర్పు ఇచ్చిన బెంచ్ లో ఈయన ఉన్నాడు. 1986 డిసెంబర్ 20న పదవీ విరమణ చేసిన ఆయన తర్వాత నల్లకోటుకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 2007 లో ఆయనకు కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. దిగ్గజ న్యాయకోవిదునిగా పేరున్న ఆయన మరణం పట్ల పలువురు న్యాయమూర్తులు, న్యాయనిపుణులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more