దేశీయ విమానయాన రంగంలో ఆయా సంస్థల మధ్య చౌక ధరల యుద్దం మళ్లీ ప్రారంభమైంది. ఫలితంగా ఉన్నత మధ్యతరగతితో పాటు మధ్యమస్థాయి మద్యతరగతి ప్రజలు కూడా ఇక విమానయానం చేసే అవకాశాలు మెండుగా కల్పిస్తున్నాయి విమానయాన సంస్థలు. కేవలం సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితమైన ఈ సేవలను మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రప్రభుత్వం ఉడాన్ పథాకాన్ని తీసుకురాగా, అంతకంటే తక్కువ ధరలో మేము టికెట్లను అందిస్తామంటున్నాయి విమానయాన సంస్థలు.
సీటు అక్యూపెన్సీ పెంచుకోవడంలో భాగంగా పలు సీట్లను కేవలం నో ప్రాఫిట్ ధరలకు మాత్రమే అందించి తమ సంస్థలకు లాభాలను అర్జించాలని విమానసంస్థలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఏడాదిలో పలు పర్యాయాలు పలు పథకాలతో తక్కువ ధరలకే విమానయాన టిక్కెట్లను అందిస్తున్నాయి సంస్థలు. ఇప్పటికే ఇండిగో ఎయిర్ లైన్ సమ్మర్ స్పెషల్ సేల్ ప్రకటించగా, తాజాగా అదే బాటలో పయనిస్తున్న గో ఎయిర్ సంస్థ కూడా చౌకధరల అమ్మకాలను ప్రకటించింది.
మాన్ సూన్ క్యాంపెయిన్ పేరుతో అతి తక్కువ ధరకే విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చిన గో ఎయిర్ కేవలం. రూ. 599 ల ధరకే విమానయాన అవకాశాన్ని ప్రకటించింది. ఈ ఆఫర్ కింద మే 15, 2017 అర్ధరాత్రి వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయని గో ఎయిర్ ఎయిర్ లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అపర్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు జూలై 01 - సెప్టెంబరు 30, 2017 మధ్య ప్రయాణాలు చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కింద తమ నెట్ వర్క్ పరిధిలోని నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ డిస్కౌంట్ చెల్లుతుంది. 23 సెక్టార్లలో గో ఎయిర్ ఎయిర్లైన్స్ నడుపుతున్న విమానాల్లో ప్రయాణీకులకు అత్యల్ప ఛార్జీలను అందిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more