ప్రజలను దగా చేసేందుకు శ్రీశ్రీ చెప్పినట్లుగా ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా, దగా అను మాటలను అక్షరాల పాటిస్తూన్నారని, వారి నుంచి అప్రమత్తంగా వుండాలని కేంద్ర ఇంధనశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ఇంధన శాఖలోని అధికారిక ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో లింక్ అయి, రమారమి అలానే వుండేలా అనేక వెబ్ సైట్లు ఇప్పుడు నకిలీవి పుట్టుకోచ్చాయని.. వాటి నుంచి అప్రమత్తంగా వుండాలని ఇంధన శాఖ ప్రజలను హెచ్చరించింది. ఈ వెబ్ సైట్లలో పొందుపర్చే సమాచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఉచిత ఎల్పీజీ స్కీమ్ పేరుతో వస్తున్న నకిలీ వెబ్ సైట్లతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఉచితంగా ఎల్పీజీ పథకాలను అందిస్తామని, ఉచితంగా మరో సిలిండర్ ను బుక్ చేసుకునే వెసలుబాటును తాము అందిస్తున్నామని నకిలీ పోర్టల్స్ ప్రజలను మభ్య పెడుతున్నాయని అన్నారు. దీంతో పాటు ఎల్పీజీ డీలర్ షిప్ ప్రకటనల గుప్పిస్తూ ప్రజలను ప్రలోభాలకు గురయ్యేలా చర్యలు చేపడుతున్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా వుండాలని ఇంధనశాఖ అధికారులు హెచ్చరించారు.
కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ తమ అధికారిక వెబ్ సైట్ www.pmujjwalayojana.com గా ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ అధికారిక వెబ్ సైట్ లో ఉచితంగా దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ఇంగ్లీష్, హిందీల్లో ఇవి లభ్యమవుతాయని పేర్కొంది. కొత్త ఎల్పీజీ కనెక్షన్ కోసం ఈ దరఖాస్తులను నింపాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఇదే అదనుగా చేసుకుని.. www.ujwalayojana.org వెబ్ సైట్లో ఆర్జీజీఎల్వీ యోజన కింద ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ షిప్ ను ప్రభుత్వం నియమించినట్టు ప్రకటన వస్తుందని, కానీ అలాంటివాటిని తాము అహ్వానించలేదని, ఇది అసలు అధికారి సంస్థ కాదని కూడా స్పష్టం చేసింది. దాని నుంచి వెలువడే ప్రకటనలతో తమకు సంబంధం లేదని తెలిపింది. ఫేక్ వెబ్ సైట్లతో అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more