పాత పెద్ద నోట్లతో అవినీతి అధికంగా చోటుచేసుకుంటుందని వాటిని రద్దు చేసిన కేంద్రం అవినీతితో పాటు ఇత్యాది అనేక కారణాలను కూడా తెలిపింది. కాగా, నోట్ల రద్దు తరువాత గత ఏడాది నవంబర్ 10 నుంచి కొత్తగా అత్యంత పెద్దనోటును ప్రజల అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో అత్యంత పెద్ద నోటును తమ చేతుల్లోకి తీసుకున్న ప్రజలకు అనేక కష్టాలు ఎదురయ్యాయి. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా చిల్లర సమస్య ఉత్పన్నమైంది.
కొత్తగా తమ చేతుల్లోకి చేరిన రెండు వేల రూపాయల నోటు.. చూసుకుని మురవడం.. డబ్బుందని సంతోషించడం తప్పితే.. ఖర్చుపెట్టేందుకు వీలులేకుండా పోయింది. ఆ తరువాత వెనువెంటనే రూ 500 నోట్లను అందుబాటులోకి తీసుకురావడంతో ఈ సమస్య ఎట్టకేలకు తీరింది. అయితే త్వరలో వంద నోట్లను కూడా రద్దు చేసి వాటిస్తానంలో కొత్తగా ముద్రించిన 100 నోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరోమారు చిల్లర సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటుంది.
వంద నోట్లను రద్దు చేసే ముందే.. ప్రజల అందుబాటులోకి కొత్తగా ముద్రించిన రెండు వందల రూపాయల నోటును తీసుకురానుంది. ఇందుకు ఆర్బీఐ సమ్మతి కూడా తెలిపిందని సమాచారం. ఈ ఏడాది జూన్ మాసం తరువాత ఈ నోట్ల ముద్రణను చేపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు సెంట్రల్ బోర్డు అమోదం కూడా లభించిందని సమాచారం. ఈ మేరకు గత మార్చిలోనే సెంట్రల్ బోర్డు అమోదం లభించిందని.. దీంతో నుంచి ముద్రణ చేపట్టనున్నట్లు సమాచారం.
అర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో పాటుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్, అర్థిక విభాగం కార్యదర్శి అన్జులై చిబ్ దుగ్గల్ లతో పాటు నలుగురు అర్బీఐ డిఫ్యూటీ గవర్నర్లుతో పాటు మొత్తంగా 14 మంది సభ్యులున్న అర్బీఐ సెంట్రల బోర్డు అమోదం లభించడంతో.. ప్రస్తుతం రెండు వందల రూపాయల నోటు డిజైన్ సహా తదితర వ్యవహరాలపై అర్బీఐ దృష్టి సారించింది. ఇది కూడా ఫైనల్ చేసిన తరువాత న్యూ నోట్ ప్రింటింగ్ ప్రెస్ కు పంపి ముద్రణ చేపట్టనున్నారు. మొత్తానికి ఈ ఏడాదిలోపు దేశ ప్రజలను కొత్తగా రానున్న రెండు వందల రూపాయల నోట్లు పలకరించనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more