ఏళ్ల తరబడి నానుతున్న అగ్రిగోల్డ్ బాధితుల వ్యవహారంపై జనసేన ఛీప్ పవన్ కళ్యాణ్ స్పందించాడు. వారిని పరామర్శించి, న్యాయం జరిగేలా భరోసా ఇస్తూ, అవసరమైతే పోరాటానికి సిద్ధమని ప్రకటించేందుకు సిద్ధం అయ్యాడు. ఈ మేరకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనకు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాధితులు సమావేశం కానున్నారు.
ఇక బాధితులతో సమావేశమయ్యే సమయంలో చెల్లించాల్సిన డబ్బులను ఎప్పుడు ఇస్తారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని కడిగేసే ఛాన్స్ ఉంది. నోటి మాట కాకుండా హామీ ఆచరణ రూపంలో ఉండాలని కోరే అవకాశం ఉంది. పవనే స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో తమకు సత్వర న్యాయం జరుగుతుందని బాధితులు కూడా భావిస్తున్నారు. కాగా, ఈ సభకు ఎంపికచేసిన 650 మంది బాధితులను మాత్రమే అనుమతించనున్నామని జనసేన వర్గాలు వెల్లడించాయి.
కాగా, అగ్రిగోల్డ్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ కూడా ఇచ్చాడు. స్థిరాస్తి వ్యాపారంతో ప్రజలకు ఎ అధిక వడ్డీ ఆశ చూపి 32లక్షల 2వేల 607మంది నుంచి రూ.6380 కోట్ల డిపాజిట్లు సేకరించారని, మొత్తం 9 రాష్ట్రాల్లో 32లక్షల మంది బాధితులు ఉన్నారన్నాడు. 2015 జనవరిలో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించగా, 2016 నుంచి అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రారంభమైందని వివరించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేసులో ఇప్పటికే తొమ్మిదిమందిని అరెస్ట్ చేసినట్లు చంద్రబాబు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల ఆచూకీ తెలిపితే రూ.10 లక్షల ప్రోత్సాహం ఇస్తామన్నారు. అవసరం అయితే సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more