సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. భారత్ స్టేజ్-3 (బీఎస్-3) కర్బన ఉద్గారా ప్రమాణాలతో తయారయిన వాహనాలపై నిషేధం విధించింది. అలాంటి వాహనాలను తయారీదారులు కానీ, డీలర్ల కానీ విక్రయించడానికి వీల్లేదని ధర్మాసనం ఆదేశించింది. ఆటోమొబైల్ తయారీదారుల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని ఈ సందర్భంగా చెంచ్ వ్యాఖ్యానించటం విశేషం.
మోటారు వాహనాల చట్టం-1988 కింద బీఎస్-4 ప్రమాణాలు లేని వాహనాలను అధికారులు రిజస్టర్ చేయకూడదని ఆదేశించింది. అయితే మార్చి 31లోపు విక్రయించినట్టు స్పష్టమైన రుజువులు చూపిస్తేనే రిజిస్ట్రేషన్ చేయవచ్చని తీర్పులో పేర్కొంది. పర్యావరణంలో కాలుష్యానికి కారకాలవుతున్న బీఎస్-3 ప్రమాణాలు కలిగిన వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం వాదనలు విన్న కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
మరోపక్క కంపెనీల వద్ద ఆ ప్రమాణాలు గల వాహనాలు 8.24 లక్షలు ఉన్నాయని, వాటిలో 96వేలు వాణిజ్య వాహనాలు కాగా 6 లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు, 40వేల త్రిచక్ర వాహనాలు ఉన్నట్టు ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ఇదివరకే సుప్రీంకోర్టుకు తెలియజేసింది. గతంలో బీఎస్-2 నుంచి బీఎస్-3కి మారినప్పుడు మిగిలి ఉన్న వాహనాల విక్రయానికి అనుమతించినట్టు సియామ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయినప్పటికీ ప్రజారోగ్యంకే ఓటేసిన జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఈ తీర్పుతో మొత్తం ఆటోమొబైల్ సరఫరా వ్యవస్థకు ఇబ్బందుల ఏర్పడతాయని, 3 వేల కోట్ల నష్టం వాటిల్లుతుతందని ఆటోమొబైల్ రంగ ప్రముఖుడు, ఈవై పార్ట్నర్ రాకేశ్ భాత్ర పేర్కొనగా, పర్యావరణ వేత్తలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే బీఎస్-4 వాహనాల చట్టంతోపాటు సుప్రీం జారీ చేసిన ఈ ఆదేశాలు కూడా అమల్లోకి వస్తాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more