అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాలు మరోసారి సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికార పార్టీ పీపుల్స్ పార్టీ ఫర్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ) నిర్ణయం వెలువరించింది. సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మీన్, మరో ఐదుగురు శాసనసభ్యుల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం సాయంత్రం ఓ ప్రకటన వెలువడింది.
పార్టీ రాజ్యాంగం ప్రకారం తనకు ఉన్న విచక్షణాధికారంతో ఈ సస్పెన్షన్ విధిస్తున్నట్లు పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కాఫా బెంగియా చెప్పారు. ఈ సస్పెన్షన్ తో పీపీఏ లెజిస్లేచర్ పార్టీకి నాయకుడిగా ఉండే అర్హతను సీఎం కోల్పోయారు. దీంతో మధ్యస్థ ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోవటంతో సిద్ధంగా ఉండాలని అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడు పాడి రిచో కార్యకర్తలకు పిలుపునిచ్చాడు.
కాగా, ఎంతో నమ్మకస్తుడైన నబమ్ టుంకీ ని సీఎం పదవి నుండి తొలగించి మరీ ఆ స్థానంలో యువకుడైన పెమా ఖండూని నిలబెట్టింది పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. జూలై 16న ఖండూ సీఎంగా బాధ్యతలు స్వీకరించాడు. అతను సీఎం అయ్యాక….రాహుల్ ని కలిసి మరీ థ్యాంక్స్ చెప్పాడు. అయితే ఆ తర్వాతే అసలు వ్యవహారం మొదలైంది. నమ్మకంతో సీఎం ను చేసిన ప్రేమ ఖండూ కాంగ్రెస్ కు హ్యాండిచ్చి తన మద్ధతుదారులైన 44మందిని తీసుకుని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్(బీజేపీ మద్ధతు ఉన్న పార్టీ) లో చేరిపోయాడు. ఇలా ఒక సీఎం మెజారిటీ సభ్యులతో వేరే పార్టీలో చేరిపోవటం దేశ చరిత్రలో తొలిసారి జరిగింది. దాంతో తాము సీఎం పీఠం నుంచి దించేసిన లుంకీ ఒక్కడే ఆ పార్టీ సభ్యుడిగా ఇప్పుడు ఉన్నాడు.
ఇక తాజా పరిణామాలను ఉపయోగించుకోవాలని చూస్తున్న బీజేపీ రంగంలోకి దిగింది. పెమాకు తాము అండగా ఉంటామని ఆ పార్టీ ప్రతినిధి రాంమాధవ్ ప్రకటించాడు కూడా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more