ప్రపంచ కాలుష్య కోర నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ టాప్ టెన్ ప్లేస్ లో నిలిచింది. ఓవైపు వాహనాలు, మరోవైపు పరిశ్రమలు ఇలా వాయుకాలుష్యంతో పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. వీధులన్నీ కాలుష్యంతో కూడిన పొగమంచుతో నిండిపోవడంతో రోడ్లమీదికి రావడానికి ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా దీపావళి తర్వాత ఆ పరిస్థితి ఎమర్జెన్సీని తలపించింది. అవసరమైతే తప్ప బయటికి రావద్దని, ఢిల్లీ ప్రభుత్వం కూడా పాఠశాలలకైతే ఏకంగా మూడు రోజుల సెలవు ప్రకటించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. ఢిల్లీలోపాటు ఎన్ సీఆర్ ఏరియాలో బాణసంచాపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఢిల్లీలో శబ్ధ మరియు వాయు కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అమ్మకందారుల లైసెన్స్ లు రద్దు చేయాలని, ప్రస్తుతానికి కొత్త లైసెన్స్ లు జారీ చేయవద్దని, బాణసంచావల్ల కలిగే దుష్ప్రభావాలపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
అంతేకాదు తయారు చేస్తున్న బాణాసంచాలలో హానికారక పదార్థాల వాడకంపై విచారణ చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇప్పటికే ఢిల్లీ కాలుష్య కాసారంగా మారింది. విషవాయువుల ప్రభావం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిన విషయం తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా పండగ సమయంలో తప్ప మిగతా వేళలో బాణాసంచాలు పేల్చొద్దంటూ ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంను కోరాడు కూడా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more