నగర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అబిడ్స్ లోని రెండు థియేటర్లకు సాలిడ్ వార్నింగ్ ఇచ్చాడు. హిందీ సినిమాలు ఎక్కువగా ప్రదర్శించే సంతోష్, స్వప్న థియేటర్ల యాజమాన్యాలను హెచ్చరిస్తూ ఓ లేఖ రాశాడు. కరణ్ జోహర్ దర్శకత్వంలో వస్తున్న 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాను ఆ రెండింటిలో ప్రదర్శిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించాడు. తన హెచ్చరికలు బేఖాతరు చేస్తూ సినిమాను ప్రదర్శిస్తే మాత్రం తాను కేజ్రీవాల్ లా ధర్నా చేసేవాడిని కాదని అందులో పేర్కొన్నాడు. అవసరమైతే పెట్రోల్ తీసుకెళ్లి ధియేటర్ ను కాల్చేస్తానని తెలిపాడు.
ఇంతకీ ఆయన వాదన ఏంటంటే... కరణ్ జోహార్ పెద్ద ప్రొడ్యూసర్.. ఈ సినిమా విడుదల కాకపోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ, కరణ్ ఇచ్చిన రెమ్యూనరేషన్ తో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ తన సొంత దేశం పాకిస్థాన్ వెళ్లి ట్యాక్సులు కడతాడు. అది గవర్నమెంట్ కి చేరి, దానిని వారు ఐఎస్ఐ ఉగ్రవాదులకు ఇస్తారు. వాళ్లు బాంబులు, తుపాకులు తయారుచేసి తీవ్రవాదులకు అందిస్తారు. వాళ్లు వాటితో మన సైనికులను హతమార్చుతారని అన్నారు. అంటే మన డబ్బుతో మనల్నే అంతం చేస్తారని ఆయన అంటున్నాడు. అలా జరగకూడదనే తన ప్రయత్నం తాను చేస్తున్నానని ఆయన తెలిపారు.
ఇక తన నియోజకవర్గంలో ఓ పాకిస్థాన్ నటుడి సినిమాను ప్రదర్శించడాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోనని చెప్పిన రాజాసింగ్, సినిమా విడుదలైతే థియేటర్లను నాశనం చేస్తానని హెచ్చరించాడు. మరోవైపు చైనా టపాసులు కొనుగోలు చేయొద్దంటూ ప్రజలకు విజ్నప్తి చేస్తున్నాడు. ఆ డబ్బును చైనా భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ లో కారిడార్లు కట్టేందుకు, పాక్ తీవ్రవాదులకు సాయం చేసేందుకు వినియోగిస్తోందని చెబుతున్నారు. బహుశా ఇంతవరకు ఏ ప్రతినిధి కూడా ఇంతలా ఆలోచన చేయలేదేమో.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more