తెలుగు రాష్ట్రాల డెవలెప్ మెంట్ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి స్నేహం కొనసాగిస్తామని ప్రకటించిన ఇద్దరు చంద్రులు, విమర్శల విషయంలో మాత్రం వెనకడుగు వేయటం లేదు. నిన్న కొత్త జిల్లాల ప్రారంభం సందర్భంగా సిద్ధి పేటలో కేసీఆర్ మాట్లాడుతూ పక్క రాష్ట్రాలు అసూయ పడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తానని ప్రకటించి కొద్ది గంటలు గడవక ముందే ఏపీ సీఎం చంద్రబాబు పరోక్షంగా కౌంటర్ వేసేశాడు.
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక సచివాలయం బుధవారం ఉదయం ప్రారంభించారు. హైదరాబాద్ లో పదేళ్ల పాటు ఉండే హక్కు ఉన్నప్పటికీ, పాలన మన నేలపై నుంచి మాత్రమే సాగాలన్న ఉద్దేశంతో వేగంగా భవనాల నిర్మాణాలు సాగించినట్టు వెల్లడించారు. అభివృద్ధిని చూసి కొంతమంది అసూయ పడుతున్నారని, వారు చేసే విమర్శలను పట్టించుకోనవసరం లేదంటూ ఇండైరక్ట్ గా కామెంట్లు చేశాడు.
ఇక తన చాంబర్ లోకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రవేశించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సచివాలయ ఉద్యోగులు ఆయనకు శుభాకంక్షలు తెలిపారు. తన చాంబర్ లోని సీటులో కూర్చున్న అనంతరం డ్యాష్ బోర్డు ద్వారా ప్రాజెక్టుల్లో నీటి పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, ఆపై పెండింగ్ లో ఉన్న డ్వాక్రా మహిళల రుణమాఫీ ఫైల్ పై సంతకం చేశారు. ఇకపై పాలన అమరావతి కేంద్రంగానే సాగుతుందని తెలిపారు. డ్వాక్రా మహిళలకు రెండో విడత పెట్టుబడి రాయితీల కింద రూ. 2,500 కోట్లు విడుదల చేస్తున్నట్టు చంద్రబాబు తెలియజేశారు. సీఎం వెంట చిన రాజప్ప, నారాయణ, కొల్లు రవీంద్ర, చీఫ్ సెక్రటరీ టక్కర్, డీజీపీ సాంబశివరావు, ఉన్నతాధికారులు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజధాని ప్రాంత రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more