ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా కొనసాగుతున్న మూడో టెస్టులోనూ పైచేయి సాధించి పర్యాటక జట్టును ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని ప్రణాళికలు రచించిన టీమిండియా అందుకు అనుగూణంగా న్యూజీలాండ్ ముందు భారీ విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. రెండో ఇన్నింగ్స్ లో 216 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కివీస్ ముందు 475 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. తొలి ఇన్నింగ్స్లో 299 పరుగులకే చాప చుట్టేసిన వైనం చూస్తే.. మరోసారి అశ్విన్ - జడేజా స్పిన్ జోడీ తమ మంత్రాన్ని పారిస్తే టీమిండియా క్లీన్ స్వీప్ ఖాయంగా కనిపిస్తోంది.
భారీ ఆధిక్యం ఉన్నా ఫాలో ఆన్ ఆడించకుండా బ్యాటింగ్ మొదలుపెట్టించిన కోహ్లీ.. అనుకున్నట్లే 200 పరుగులకు పైగా స్కోరు దాటడం, ఫాంలో ఉన్న పుజారా సెంచరీ చేయడం పూర్తి కాగానే ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. అంతకుముందు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్ మురళీ విజయ్ (19) వికెట్ల వెనుక దొరికేశాడు. దాంతో అప్పటికి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన గౌతమ్ గంభీర్ మళ్లీ వచ్చి ఈసారి ఏకంగా అర్ధసెంచరీ కొట్టాడు. ఆ తర్వాత జీతన్ పటేల్ బౌలింగ్లో ఒక భారీషాట్కు ప్రయత్నించి గుప్తిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
మొదటి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ సాధించిన కెప్టెన్ కోహ్లీ అంపైర్ తప్పిదం కారణంగా 17 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. రీప్లేలో బంతి వికెట్ల అవతలకు వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. అంపైర్ నిర్ణయం పట్ల కోహ్లీ కూడా అసంతృప్తి చెందినట్లు కనిపించింది. మరోవైపు ఛటేశ్వర్ పుజారా వేగంగా ఆడి.. 148 బంతుల్లో 9 ఫోర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అజింక్య రహానే కూడా 20 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసి నాటౌట్గా ఉండగా.. కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, కివీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more