నవ తెలంగాణలో 31 జిల్లాల ప్రారంభం.. కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట.. KCR inaugurates Siddipet district

Years of dream came true says cm kcr

Narasaraopet MP sensational allegations, member of parliament. TDP MP sensational allegations, TDP MP Rayapati Sambasiva Rao, Tdp MP sensational allegations, andhra pradesh, TdP, chandrababu naidu, Nara lokesh, Rayapati, corruption, tdp government corruption

Chief Minister K. Chandrasekhar Rao said that years of dream on the formation of districts came true on the auspicious occasion of Dasara across Telangana.

30 ఏళ్ల కల సాకారమైంది, సిద్దిపేట జిల్లాగా అవిర్భవించింది..

Posted: 10/11/2016 01:48 PM IST
Years of dream came true says cm kcr

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల సంబురం అంబరాన్ని తాకింది. కొత్తగా ఏర్పాటు చేసిన 21 జిల్లాలను విజయదశమి రోజున ధనుర్ లగ్నంలో 11.13 గంటలకు అట్టహాసంగా ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నిర్ణీత సమయానికి సిద్ధిపేట కలెక్టర్ భవనానికి చేరుకున్న కేసీఆర్ తొలుత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత, కేసీఆర్, హరీష్ రావులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత, కొత్త జిల్లా శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆ తరువాత హారతి ఇచ్చి, బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి, దాన్ని పగలగొట్టి, రిబ్బన్ కట్ చేసి కలెక్టరేట్ భవంనంలోకి ప్రవేశించారు.

సిద్ధిపేట జిల్లాను తన చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిద్ధిపేట జిల్లాను ప్రారంభించిన అనంతరం ఓపెన్ టాప్ వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన... సిద్ధిపేటలో తనకు తెలియని వీధి, గడప లేదని అన్నారు. సిద్ధిపేట ఓ అద్భుతమైన ప్రాంతంగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. 30 ఏళ్ల క్రితమే సిద్ధిపేట జిల్లాను ఏర్పాటు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను కోరానని... కానీ, అప్పట్లో అది సాధ్యం కాలేదని కేసీఆర్ చెప్పారు.  21 కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలోని మొత్తం జిల్లాల సంఖ్య 31కి పెరిగిందన్నారు

దీని వల్ల, రాష్ట్రంలో అదనంగా 21 మంది కలెక్టర్లు, 21 మంది ఎస్పీలు వచ్చారని... దీంతో, పరిపాలన మరింత మెరుగవుతుందని చెప్పారు. సిద్ధిపేటలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని హరీష్ రావు కోరారని... వచ్చే ఏడాది మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని చెప్పారు. సిద్ధిపేట అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తానని తెలిపారు. యువకుడైన హరీష్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారని... ఆయన నాయకత్వంలో జిల్లా అభివృద్ధిపథంలో పయనిస్తుందని చెప్పారు. హరీష్ కు నా ఆశీస్సులు అంటూ మేనల్లుడిని దీవించారు. తానెక్కడున్నా తన మనసు సిద్ధిపేట మీదే ఉంటుందని... ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకేనని కేసీఆర్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  siddipet  harish rao  new districts  medical collage  telangana  

Other Articles