ప్రపంచంలో ఏ దేశంలోనూ నెలకొనని విభిన్నమైన పరిస్థితి.. ఉరి ఘటన తరువాత మన దేశంలో నెలకొందని ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నాడు. ఉరి ఘటన, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో వెలువడుతున్న కథనాల నేపథ్యంలో ఆయన లేటుగా స్పందించింనా.. సూటిగా.. సుత్తిలేకండా తన మదిలో వున్న విషయాన్ని తన సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. తాను ఈ ఘటనలపై ఒక ప్రముఖ నటుడిగానో లేక సెలబ్రిటీగానో స్పందించడం లేదని, ఒక అర్మీ అధికారి తనయుడిగా తాను తన మనస్సులోని వున్న ప్రశ్నలను బయటపెడుతున్నానని అన్నారు.
ఉరీ ఘటన జరిగిన వెంటనే పలువరు పాకిస్థాన్ నటులను బ్యాన్ చేయాలని అడుగుతుండగా, మరికోందరు సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కడ, ఎలా జరిగాయో అధారాలను బయటపెట్టాల్సిందిగా డిమాండ్లు రావడం.. ఇంకోందరు యుద్దం జరుగుతుందేమోనని అందోళన చెందడంపై అయన విస్మయం వ్యక్తం చేశారు. ఇది యావత్ జాతి సిగ్గుపడాల్సిన విషయమని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ప్రస్తతం అలోచించాల్సింది ఉరీ ఘటనలో అమరులైన 19 మంది జవాన్ల గురించని అయన దేశప్రజలకు సూచించారు.
ఈ దాడిలో 24 ఏళ్ల నితన్ యాదవ్ దేశ రక్షణలో భాగంగా తన ప్రాణార్ఫణ చేశాడని, అది భారత జాతి గుర్తు చేసుకోవాల్సింది పోయి.. రాజకీయాలు, పాకిస్తాన్ నటులు బహిష్కరణల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వాదనలు తరువాత ముందుగా అమరులైన అర్మీ జవాన్ల గురించి, వారి కుటుంబాల గురించి అలోచిండీ అని ఆయన విన్నవించారు. దేశంలో చోటుచేసుకుంటున్న విపరీత వాదనలతో అమరులైన జవాన్ల కుటంభసభ్యులతో పాటు అర్మీతో తమ పనిచేస్తున్న వారి కుటుంబసభ్యలు ఎలా భావిస్తారని అయన నిలదీశారు.
సినిమాలు ఆడతాయా? లేదా? నటులపై నిషేధం విధిస్తారా? లేదా? అనే ఆలోచన సరికాదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జవాన్ల గురించి. వారి భవిష్యత్ గురించి. అంతేకాని వారిని, వారి త్యాగఫలాలను విస్మరించి అనవసర వాదనలకు తెరతీయడం సబబుకాదని అన్నారు. అర్మీ సరిహద్దులో దేశానికి రక్షణగా, దేశప్రజల ప్రాణాలకు కపాలా కాస్తున్నారు కాబట్టే మనం ఇక్కడ సంతోషంగా వున్నామని, లేకపోతే ఉగ్రవాద ఘాతుకాలతో దేశం భీతిల్లిపోయేదని ‘‘జైహింద్’’ అని వీడియోలో పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more