ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. భారతదేశంలో తన ప్రధాన కార్యాలయాన్ని ఏపీలోని అమరావతిలో ఏర్పాటు చేయాలని వర్సిటీ ప్రతినిధులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ రవీంద్రబాబు తదితరులతో యూనివర్సిటీ ప్రతినిధులు సమావేశమై చర్చించారు. వర్సిటీతోపాటు సెంటరాఫ్ ఎక్సలెన్సీని కూడా ఏర్పాటు చేయనున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ కలసి ఉమ్మడి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏపీలో వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు ఈ వర్కింగ్ గ్రూప్ చర్యలు చేపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు సంకల్పించారని, అందులో భాగంగానే కేంబ్రిడ్జ్ వర్సిటీ ప్రతినిధులతో సమావేశమయ్యామన్నారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి సమావేశమవుతామని, విశ్వవిద్యాలయాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు చెప్పారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వర్సిటీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాయి.
సుమారు 900 ఏళ్ల చరిత్ర ఉన్న కేంబ్రిడ్జ్ వర్సిటీ విద్యారంగానికి మక్కా లాంటిది. 100 కి పైగా అకాడమిక్ డిపార్ట్ మెంట్లు, 30 అనుబంధ కళాశాలలున్న ఈ విద్యాలయానికి అమరాతితో ఇప్పుడు కొత్త అనుబంధం కావటం నిజంగా విశేషమే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more