పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ చదవుతున్న ఓ మైనర్ బాలికపై కన్నేసిన ఇద్దరు పిల్లలకు తండ్రి ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంట్లో ఒంటరిగా వుంటుందని అమె తల్లిదండ్రులు ఇంట్లో లేరన్న సమాచారం తెలుసుకున్న నిందితుడు.. అమె ఇంట్లోకి బలవంతంగా వెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని హెచ్చరికలు కూడా జారీచేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గురుదాస్పూర్ జిల్లా బదోష్ పట్టణానికి చెందిన ఓ వివాహితుడు, ఇద్దరు పిల్లల తండ్రైన వ్యక్తి.. ఇంటర్మీడియెట్ చదివే మైనర్ బాలికపై కన్నేశాడు. సమయం కోసం ఎదురుచూస్తున్న నిందితుడికి అమె ఇంట్లో ఒంటరిగానే వుంటుందన్న సమాచారం అందింది. బాలికను ఒంటిరిగా ఇంట్లో వదిలి, అమె తల్లిదండ్రులు కుటుంబసభ్యులతో కలసి తమ సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారని సాయంత్రానికి కానీ రారని సమాచారం అందుకున్న నిందితుడు బాలిక ఇంటికి వెళ్లాడు.
బాలిక ఇంటికెళ్లి తలుపు తట్టిన నిందితుడు.. బాలిక మాయమాల్లో పెట్టి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లోకి ప్రవేశించి యువతి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం జరిపాడు. బాధిత యువతి అలారం మోగించేందుకు యత్నించినా దాన్ని ఆపివేసి అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు. అంత్యక్రియల నుంచి తిరిగివచ్చిన తల్లిదండ్రులకు బాధిత యువతి జరిగిన దారుణం తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతిని వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more