తెలంగాణ పోలీసులకు చైన్ స్నాచింగ్ ముఠా ఇప్పటికే సవాల్ విసురుతున్న తరుణంలో దోపిడి దొంగలు కూడా తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికుల అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ దోపిడికి పథక రచన చేసిన దోపిడీ దోంగల వ్యూహం బెడిసికొట్టింది. అటు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు తామే తమ డబ్బును కాపాడుకునేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాల నేపథ్యంలో దోపిడి దొంగలు తోక ముడిచి జారుకున్నారు. తమను స్థానికులెవ్వరూ వెంబడించకుండా గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.
దీంతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో గ్రామంలో బ్యాంకులోని డబ్బును స్థానికులు కాపాడుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మొయినాబాద్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అజీజ్నగర్ బ్రాంచిపై దోపిడీ దోంగల కన్ను పడింది. దానిని దోచుకునేందుకు వారు పథకం వేశారు. రోడ్డుపైనే వున్న ఈ బ్యాంకులో చోరి చేసి ఎంచక్కా చెక్కయ్యవచ్చని వ్యూహ రచన చేశారు. కానీ స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించారు. దోపిడికి యత్నించిన దొంగలు రాత్రి ఒంటి గంటల సమయంలో తాళాలు పగలగొడుతున్న సమయంలో ఇద్దరు యువకులు వారిని ప్రశ్నించారు.
పొంతన లేని సమాధానం చెప్పిన దొంగలు యువకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. వారి దోపిడి కోసమే వచ్చారన్న విషయం అర్థమైన యువకులు స్థానికుల్ని అప్రమత్తం చేసిన గ్రామ యువకులతో వారిని వెంబడించేందుకు ప్రయత్నించారు. అటు పోలీసులకు కూడా పిర్యాదు చేశారు. గ్రామస్థులు తమను వెంబడిస్తున్నారని గమనించిన దోపిడి దొంగలు వారి నుంచి తప్పించుకునేందుకు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మాదాపూర్ డీసీపీ కార్తికేయ బుధవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై విచారణకు రెండు బృందాలను నియమించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more