సరిహద్దులో భారత ఆర్మీ దళాలు ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయి. వాయు దళం ద్వారా దాడులు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. లక్ష్యాలను సిద్ధం చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లబోతున్నారు. ఏ క్షణంలోనైనా దాడి ప్రారంభమయ్యే అవకావం ఉంది.... ఆగండి పరిస్థితి మాములుగా ఉన్న సమయంలో ఈ యుద్ధం గోల ఏంటంటారా? ఇది ఇప్పుడు కాదు కార్గిల్ వార్ సమయంలో చోటు చేసుకున్న ఘటన. కాస్తలో పాక్ పై యుద్ధం చేసి మట్టి కరిపించే ఛాన్స్ భారత్ చేజేతులారా మిస్ చేసుకుంది.
1999 మే నెలలో కార్గిల్ లోని భారత శిబిరాన్ని పాక్ ఆర్మీ ఆక్రమించిన సంగతి తెలిసిందే. ఓ వైపు దాడులను ప్రతిఘటిస్తూనే... మరోవైపు మంచి తనాన్ని పాటిస్తూ భారత్ పాక్ తో చర్చలు జరిపింది. ఈ క్రమంలో జూన్ 12న అప్పటి బీజేపీ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ - పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ మధ్య ఢిల్లీలో చర్చలు జరగగా, అవి విఫలమయ్యాయి. దీంతో పాక్ తో యుద్ధానికి భారత్ సన్నద్ధమైంది.
జూన్ 13 తెల్లవారుజామున పాక్ లోని వైమానిక స్థావరాలపై దాడికి సిద్ధంగా ఉండాలని భారత వాయు సేనకు ఆదేశాలు అందాయి. ఇందుకోసం జమ్మూకశ్మీర్ ఎయిర్ బేస్ నుంచి నాలుగు మిగ్ 27 విమానాలకు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని టార్గెట్లను నిర్దేశించారు. అత్యాధునిక ఆయుధాలు కలిగిన రెండు మిగ్ 21 విమానాలతో పాటు ఇతర ఎయిర్ బేస్ ల నుంచి మరో పది మిగ్ 29 యుద్ధ విమానాలను కూడా సిద్ధం చేశారు. దాడికి వెళ్ళే పైలెట్లకు రూట్ మ్యాపులు - రక్షణకు గన్స్ ఇచ్చారు. జూన్ 13 ఉదయం 6.30 గంటలకు పాక్ పై దాడికి సర్వం సిద్ధమైంది
అయితే ఆ రోజు ఉదయం మూడు గంటలకు పాక్ పై దాడికి దిగాలనే ఆదేశాలు ఆగిపోయాయి. దీంతో యుద్ధం ఆగిపోయింది. అయితే ఇంత పకడ్బందీగా యుద్ధానికి సిద్ధమైన భారత దేశం అకస్మాత్తుగా ఎందుకు వెనక్కు తగ్గింది అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మరోవైపు ఆ సమయంలోనే భారత్ ఆర్మీ నిర్వహిస్తున్న ఆపరేషన్ విజయ్ తో కార్గిల్ స్థావరాన్ని భారత సైన్యం తిరిగి సొతం చేసుకుంది. పాక్ తోకముడవగా భారత సైన్యం విజయం సాధించింది. ఓ పైలెట్ రాసుకున్న డైరీతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ ప్లాన్ రిపోర్ట్ ఆధారంగా ఈ ఘటన తాజాగా వెలుగుచూసింది.
ఒకవేళ ఆనాడు గనక భారత్ గనక ఆ రోజు పాక్ పై దాడి చేసి ఉంటే.... కవ్వింపు చర్యలు, ముంబై మారణహోమం, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి అంతేందుకు అసలు ఉగ్రవాదం అనే ఊసు ఉండేది కాదేమో.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more