ఆంద్రఫ్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది మేధావి వర్గాలు వున్నారని, వారు ప్రభుత్వాన్ని ముందుకు నడిపస్తున్నారని చెప్పిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలన్నీ కూడా పసలేనివని తేలిపోయాయి. తెలంగాణ నామినేటెట్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 50 లక్షల డబ్బును తమ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో ముట్టజెపుతూ అడ్డంగా రెడ్ హ్యండెడ్ గా దోరికిపోయిన చంద్రబాబు.. మళ్లీ అదే తరహా ఉదంతానికి తెరలేపారు. స్టీపెన్ సన్ తో తన ఫోన్ సంబాషణకు సంబంధించిన టేపులు లీక్ కావడంతో.. మిన్నకుండిపోయి.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అందుకు ఇంటెలిజెన్స్ ఐజీ అనురాధను బలిపశువును చేసిన చంద్రబాబు.. మళ్లీ నిస్సిగ్గుగా అలాంటి చర్యలకే పాల్పడ్డారు.
నూతనంగా అవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలాంటి గొడవలు వద్దనుకుంటున్నామని మోహమాటానికి మీడియా ముందు చెబుతున్న చంద్రబాబు.. కావాలని తెలంగాణతో కయ్యానికి కాలుదువ్వుతున్నాట్లుగా వుంది. సులభ వాణిజ్య విధానం.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ)కు సంబంధించిన ఆన్ లైన్ అప్లికేషన్లను ఏపీ ప్రభుత్వం కాపీ చేసింది. అది కూడా ఎంతలా అంటే మక్కీ టు మక్కీ కాఫీ చేసిన కేవలం తెలంగాణ అన్న చోట అంధ్రప్రదేశ్ అని మార్చివేసింది. దీంతో అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్న తెలంగాణ సర్కార్.. ఈ మేరకు సైబర్ క్రైమ్ చట్టం కింద చంద్రబాబు సర్కారుపై కేసు నమోదు చేసింది. ఇదే విషయమై తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. ర్యాంకుల కోసం ఏపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సులభ వాణిజ్య విధానంలో ప్రతి మంత్రిత్వ శాఖ తామిచ్చే అనుమతులకు ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం కల్పిస్తోంది. అలా వ్యాపార, వాణిజ్య అనుమతులను సులభతరం చేసిన రాష్ట్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ర్యాంకుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ర్యాంకులు మరి కొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. ఈవోడీబీ కోసం 340 కాలమ్ల సమాచారాన్ని జులై 7 లోగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వస్తున్న సమాచారం ఆధారంగా కేంద్రం ఈవోడీబీ స్థానాలను మదింపు చేస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అప్ లోడ్ చేసిన ఆన్ లైన్ అప్లికేషన్లను ఏపీ ప్రభుత్వం కాపీ చేసి ఏకంగా 22 రోజుల్లో 16 ర్యాంకులు ఎగబాకింది. అయితే చంద్రబాబు ఈ కేసుకు సంబంధించి ఏ అధికారిని బాధ్యులను చేస్తోరో వేచి చూడాలి మరి..!
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more