సహారా గ్రూప్ కు చెందిన ఆస్తులను అమ్మేందుకు అత్యన్నుత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే అమ్మకానికి ఎలాంటి చిక్కులు లేని ఆస్తులను ఎంచుకోవాలని సూచించింది. సహారా ఆస్తులకు చెందిన 86 టైటిల్ డీడ్ లు ఇప్పటికే సెబీ వద్ద ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, ఏఆర్ దవే, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం సహారా కేసును విచారిస్తున్నది. సహారా ఆస్తులను రిజర్వ్ ధరలో 90 శాతానికంటే తక్కువకు విక్రయించవద్దని కోర్టుబెంచ్ సెబీని ఆదేశించింది. ఒకవేళ కనీస ధరలో 90 శాతానికంటే తక్కువకు బిడ్లు దాఖలైన పక్షంలో ఆ ఆస్తిని విక్రయించేముందు కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టంచేసింది.
సహారా డిపాజిటర్లకు సొమ్ము తిరిగిచ్చే విషయం ఏమాత్రం ముందుకు కదలడం లేదని సెబీ తరపు కౌన్సిల్ తెలుపడంతో కోర్టు ఆస్తుల అమ్మకానికి అనుమతి ఇచ్చింది. ఇన్వెస్టర్లకు సొమ్ము తిరిగిచ్చే కేసుకు సంబంధించి సహారా గ్రూపు చైర్మన్ సుబ్రతారాయ్ మార్చి 4, 2014 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రెండేండ్లకు పైగా తీహార్ జైల్లో మగ్గుతున్న రాయ్కి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు విధించిన షరతులకు అనుగుణంగా సహారా గ్రూపు నిధులు సేకరించలేక సతమతమవుతున్నది. రాయ్కి బెయిల్ మంజూరు చేయాలంటే రూ.5 వేల కోట్ల నగదు, అంతేమొత్తానికి బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించాలని, ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన రూ.36 వేల కోట్లను పూర్తిగా చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తులను విక్రయించే విషయంలో తీవ్ర ఇబ్బందులెదుర్కోవాల్సి వస్తున్నదని రాయ్ తరపున న్యాయవాది కపిల్ సిబాల్ న్యాయస్థానానికి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more