దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దేశద్రోహ కేసు నిందితుడు, జె.ఎన్.యు విద్యార్ధి సంఘ నాయుకుడు కన్హయ్య కుమార్ ను పాక్ మీడియా ఆకాశానికి ఎత్తేస్తుంది. పార్లమెంట్ పై దాడి కేసులో ఉరితీయపడ్డ ఉగ్రవాది అఫ్జల్ గురు వర్ధంతిని ఢిల్లీ జెఎన్యూలో నిర్వహించి భారతదేశాన్ని ముక్కలు చేస్తాం, పాకిస్థాన్ జిందాబాద్ అంటూ జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న కన్హయ్య కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పాకిస్థాన్ మీడియా అత్యుత్సాహం చూపిస్తోంది. కన్హయ్య కుమార్ ను హీరో అభివర్ణిస్తూ బ్రహ్మరథం పడుతోంది.
కాశ్మీర్ మీద గత కొంత కాలంగా పాకిస్థాన్ తనదే ఆధిపత్యం చేయాలనుకున్నాకానీ భారత్ దాన్ని అడ్డుకుంటోంది. కానీ పాకిస్థాన్ కు ఇప్పుడు మాత్రం ఇక్కడ దిల్లీ జెఎన్.యు విద్యార్థులు, లెక్చరర్లు చేసిన స్పీచులను ప్రధానంగా పదేపదే ప్రసారం చేస్తోంది. తిరిగి మరోసారి కాశ్మీర్ పాకిస్థాన్ దే అనే బావన అక్కడి వారిలో, అంతర్జాతీయ సమాజంలో నిరూపించేందుకు, వాదించేందుకు ముందుకు వస్తోంది. ఇక పాకిస్థాన్ వెనకేసుకొస్తున్న అప్ఘల్ గురును సమర్థిస్తు జెఎన్.యు విద్యార్థులు చేసిన నినాదాలను కూడా ప్రసారం చేసింది పాక్ మీడియా. భారతీయ సైనికులు జమ్ముకాశ్మీర్లో స్త్రీలపై అత్యాచారాలు చేస్తోందన్న కన్నయ్య వ్యాఖ్యల్ని, జమ్ము కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కాదన్న ఢిల్లీ జెఎన్యూ ప్రొఫెసర్ నివేదిత వ్యాఖ్యలను కూడా పాక్ మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more