సమాజం మీద కోపంతో ఓ రిటైడ్ ఆఫీసర్ చేసిన నిర్వాకానికి 12 మంది ప్రాణాలకు ముప్పువాటిల్లింది. అసహనంతో తన కారుతో రోడ్డు దాటుతున్న విద్యార్థులను చంపాలని అనుకున్నాడు. అయితే ఓ విద్యార్థి చనిపోగా... మిగిలిన 11 మందికి ప్రాణహాని తప్పింది. చైనాలో ‘మా’ అనే మాజీ ప్రభుత్వాధికారి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. సమాజంపై కోపంతో అభంశుభం తెలియని చిన్నారులపై ప్రతీకార దాడికి దిగాడు. అయితే దీనికి సంబందించిన దృశ్యాలు సిసిటివీలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వ్యాపిస్తోంది.
చైనాకు చెందిన మా అనే రిటైడ్ అధికారి.. ఈ కిరాతకానికి పాల్పడ్డారు. అయితే కారుతో విద్యార్థులను గుద్దిన వెంటనే అక్కడి నుండి పరారయ్యాడు. ఆ తర్వాత అతన్ని వెంటాడి పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ సిబ్బంది అవినీతిపై దర్యాప్తు చేసే నాన్యాంగ్ సిటీ పీపుల్ విభాగంలో పనిచేసిన 'మా' ఓ రిటైర్డ్ దర్యాప్తు అధికారి. సమాజం తీరుపై అసంతృప్తి చెందిన అతను ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పాఠశాల నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతున్న విద్యార్థుల సమూహంపై బీవైడీ మోడల్ వాహనంతో అతడు దూసుకుపోయాడు. విద్యార్థుల లక్ష్యంగా తన కారును వేగంగా నడుపడంతో దాదాపు 12 మంది చిన్నారులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. కాగా వెంటనే వద్యార్థులను స్థానిక ఆస్పత్రనికి తరలించారు. అందులో ఓ విద్యార్థి ఆరోగ్యం విషమించి. మరణించారు. మిగిలిన 11 మంది విద్యార్థులు పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more