చైనాలో ఒక్కరు చాలు అని, మన దేశంలో అయితే ఇద్దరు చాలు అని ప్రచారం నడుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న జనాభా అందరిని భయపెడుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలను కనాలంటేనే భయపడుతున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం 1300 మంది పిల్లలను కన్నట్లు వార్తలు వస్తున్నాయి. అవును.. అతని వల్ల 1300 మంది పుట్టారట. ఓ డిటెక్టివ్ కనుగొన్న విషయాలు అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 1300 మంది పిల్లలు పుట్టడానికి కారణమైన వ్యక్తి.. వీర్యాన్ని దానం చేసే వాడు కాదు(స్పెర్మ్ డోనర్) ఓ మామూలు రిటైడ్ పోస్ట్ మాస్టర్. ఇప్పుడు 85 ఏళ్లు వయసుకు చేరుకున్న ఆ మాజీ పోస్ట్ మాస్టర్ రాసలీలలకు ప్రతిఫలమే ఈ అక్రమ సంతానం.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. అలాగని ఆ వ్యక్తి స్పెర్మ్ డోనర్ కాదు. ఓ రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ రాసలీల ఫలితంగా పుట్టిన దాదాపు 1300 మంది పిల్లల పుట్టుకను ఓ ప్రైవేట్ డిటెక్టివ్ కనిపెట్టాడు. దీని కోసం 15 ఏళ్లపాటు ఎంతో కష్టపడి వేల మంది డీఎన్ఏ సేకరించి ఈ విషయం బయటపెట్టాడు. 2001వ సంవత్సరంలో తన వద్దకు ఇద్దరు వేర్వేరు వ్యక్తులు వచ్చి, డీఎన్ఏ శాంపిల్స్ ఇచ్చి తమ తండ్రులెవరో కనిపెట్టమన్నారని.. ఆశ్చర్యకరంగా వారిద్దరి తండ్రీ ఒకరేనని తెలిసిందని ఆయన అన్నారు. అప్పుడు మొదలైన ఈ ఆపరేషన్... తన వద్ద ఉన్న శాంపిల్స్లో చాలా ఈ డీఎన్ఏతో సరిపోయాయి. ఇప్పటి వరకు ఆ వ్యక్తి వల్ల 1300 మంది ప్రాణం పోసుకున్నట్టు తన పరిశోధనలో తేలిందని అన్నారు. కాగా, ఈ విషయాన్ని ఆ మాజీ పోస్ట్ మాస్టర్ ఖండించలేదు. ఆ రోజుల్లో గర్భనిరోధక మాత్రలు గురించి తనకు పెద్దగా అవగాహన లేదని ఓ విలేకరితో నవ్వుతూ చెప్పాడు. 1960ల్లో తన జీవితంలో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయని, అయినా తను చేసిన పనులకు పశ్చాత్తాపం పడటం లేదని తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more