పాపం తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో గడ్డు కాలం నడుస్తోంది అని అందరికి తెలుసు. గత ఎన్నికల నుండి కూడా తెలుగుదేశానికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కానీ తాజాగా మాత్రం సీన్ సితారైంది. బలం లేనప్పుడు అరటిపండు తిన్నా పళ్లు విరిగినట్లుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఒకే ఒక్క కార్పోరేటర్ గెలుపొందగా తాజాగా అలాంటి విపత్కర పరిస్థితే ఎదురైంది. నారాయణ్ ఖేడ్ ఎన్నికలు మరోసారి తెలుగుదేశం పార్టీ బ్యాడ్ టైం ను గుర్తు చేసింది. ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత రేవంత్ రెడ్డి లాంటి నాయకులు. చంద్రబాబు నాయుడు లాంటి ఉద్దండ పండితులు ఏం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది.
నారాయణఖేడ్ బైపోల్లో మొత్తం లక్షా 54,866 ఓట్లు పోలయ్యాయి. డిపాజిట్ రావాలంటే 25 వేలకు పైగా ఓట్లు రావాల్సి ఉంది. కానీ టీడీపీ ఆ టార్గెట్ను రీచ్ కాలేకపోయింది. టీడీపీ కేవలం 14 వేల 787 ఓట్లు మాత్రమే సాధించింది. దీంతో డిపాజిట్ గల్లంతైంది. కాంగ్రెస్ 39 వేల 451 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ 53వేల 625 ఓట్ల మేజారిటీతో విజయం సాధించింది. ఆ పార్టీకి మొత్తం 93 వేల 76 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ చాలా రౌండ్లలో వెయ్యి ఓట్లను కూడా సాధించలేకపోయింది. కేవలం నాలుగు రౌండ్లలో మాత్రమే వెయ్యికి మించి ఓట్లను సాధించగలిగింది. అలా మొత్తానికి నారాయణ్ ఖేడ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బిజెపి ఉమ్మడి అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం విశేషమే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more