గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేయ్యడానికి కోతల్లేని కరెంట్ చాలు అని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రం విడిపోతే చిమ్మచీకట్లు కమ్ముకుంటాయని విష ప్రచారం చేశారు. 30 ఏళ్ల పాటు నెలకొన్న దుస్థితికి, విష ప్రచారాలకు తెరదించాం. ఇప్పుడు నగరంలో నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తున్నాం. గతంలో విద్యుత్ లేక పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు చేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. ఎవరికి ఓటు వేస్తే సత్ఫలితాలు వస్తాయో మేధావులు, విజ్ఞులు ఆలోచించాలి. ప్రస్తుత తరుణంలో ఏ పార్టీకి ఓటు వేస్తే బాగుంటుందో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలి. పండ్ల చెట్టు పెడితే పండ్లే వస్తాయి. ముండ్ల చెట్టు పెడితే ముండ్లే వస్తాయి. ఏ చెట్టు పెడితే మంచి ఫలాలు వస్తాయో ప్రజలు, మేధావులు ఆలోచించుకోవాలి. ఓటు వేసే విషయంపై ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ప్రజలు పార్టీల నిబద్ధతను కూడా పరిశీలించాలని సూచించారు. ఫిబ్రవరి 2న జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలంతా పాల్గొనాలని సీఎం కేసీఆర్ కోరారు. జంట నగరాల ప్రజలు ఓటింగ్లో పాల్గొనరు అనే అపవాదు ఉంది. ఈ అపవాదును జంటనగరాలు పారద్రోలాలి. ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యస్ఫూర్తిని, విజ్ఞతను ప్రదర్శించాలి. గ్రేటర్ ప్రజలంతా ఓటింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more