ఏపి నగరి ఎమ్మెల్యే రోజా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో ఏపి అసెంబ్లీ సమావేశాల్లో రోజా చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర దుమారం రేగింది. రోజా చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో అన్ని పక్షాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. కాల్ మనీ అంశంలో ఏపి సిఎం నారాచంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైసీపీ ఎమ్మెల్యేలలో రోజా మరీ పరుషంగా మాట్లాడారు. కామ సిఎం అంటూ నినాదాలు చేశారు. అయితే చంద్రబాబుకు అండగా నిలిచిన ఎమ్మెల్యేలు, మంత్రలను రోజా తీవ్రంగా వ్యతిరేకిస్తూ నోటికివచ్చినట్లు మాట్లాడారు. అయితే పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మీద తీవ్ర వ్యాఖ్యలు చెయ్యడంతో ఆమె రోజా మీద కోటి రూపాయల పరువు నష్టం దావా వేసినట్లు మీడియకు వెల్లడించారు.
ఏపి అసెంబ్లీ సమావేశాల్లో అధికారపక్ష ఎమ్మెల్యేలు, మంత్రుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన రోజా మీద స్పీకర్ గతంలోనే సస్పెన్షన్ వేటు వేశారు. అయితే తాజాగా ఎమ్మెల్యే అనిత లీగల్ గా పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. తనకు జరిగిన అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలనే తాను లీగల్ గా పోరాటానికి సిద్దపడుతున్నట్లు అనిత వెల్లడించారు. తన మీద లేనిపోని వ్యాఖ్యలు చేసిన రోజా లీగల్ గా నోటిసులు అందుకోవాలని.. అనిత అన్నారు. తాను ఏ తప్పు చెయ్యకున్నా కూడా తనను దూషించడం మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తప్పు చేసినట్లయితే క్షమాపణ చెప్పడానికి సిద్దం అని అనిత తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more