India vs Australia, 2nd ODI: India set for big total against Australia at the Gabba

India set for big total against australia at the gabba

live cricket score, live score cricket, cricket live score, india vs australia live, live ind vs aus, ind vs aus live, live ind vs aus, india australia live, ind vs aus 2nd odi live score, ind vs australia 2nd odi live score, ind vs sa 2nd odi match live score, india australia 2nd odi live score, india australia perth, ind vs aus live waca

Ind vs Aus, 2nd ODI live score - India take on Australia to set big total at the Gabba, Brisbane.

అసీస్ ఎదుట 309 పరుగల విజయలక్ష్యాన్ని నిర్ధేశించిన భారత్

Posted: 01/15/2016 02:18 PM IST
India set for big total against australia at the gabba

అస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు వన్డే సిరీస్ లలో తొలి వన్డే మ్యాచ్ ను గెలిచి జోరుమీదున్న అతిథ్యజట్టుకు భారత్ రెండో వన్డేలోనూ రమారమి తొలి వన్డేలో నిర్ధేశించిన విజయలక్ష్యాన్నే అసీస్ ముందుంచింది. తొలి వన్డేలో 310 పరుగుల టార్గెట్ ను అసీస్ ముందుంచిన ధోని సేన.. రెండో వన్డేలో ఒక్క పరుగు తక్కువగా 309 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. గబ్బా స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో ఫ్లాట్ వికెట్ అనుకూలతను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న టీమిండియా పరుగుల వరద పారించింది. ఆదిలో ఓపెనర్ శిఖర్ ధవన్(6) వికెట్ ను కోల్పోయినా.. ఆ తరువాత రెండు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి 309 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మరోసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు చక్కటి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు.  విరాట్(59) హాఫ్ సెంచరీతో రాణిస్తే, రోహిత్(124; 127 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి కళాత్మక ఇన్నింగ్స్ తో శతకం నమోదు చేశాడు.  కాగా, విరాట్-రోహిత్ శర్మల జోడీ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరడం అభిమానుల్ని నిరాశపరిచింది. ఈ జోడీ 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మంచి పునాది వేయగా, ఆపై రోహిత్-అజింకా రహానే ల జోడి మూడో వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.

ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(11) క్రీజ్ లో ఎక్కువ సేపు నిలవలేదు. రోహిత్ శర్మ ఔటయిన తరువాత భారత్ వికెట్లు ఒక్కోక్కటి వెనువెంటనే పడ్డాయి. రోహిత్ అవుట్ అయిన వెంటనే ధోని, ఆ తరువాత కొద్ది సేపు నిలదోక్కకుని అడిన రహానే(89) సెంచరీ సాధిస్తాడని అనుకున్న నేపథ్యంలో సరిగ్గా 89 పరుగల వద్ద పెవీలియన్ కు చేరాడు. ఆ తరువాత మనీష్ పాండే (6), రవీంద్ర జడేజా (5), అశ్విన్(1) లు స్కోరును పెంచే యత్నంలో వెంట వెంటనే అవుట్ కావడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.  ఆసీస్ బౌలర్లలో ఫాల్కనర్ కు రెండు వికెట్లు లభించగా, జోయల్ పారిస్, బోలాండ్, హాస్టింగ్స్ లకు తలోవికెట్ దక్కింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Australia  Gabba  2nd one day  

Other Articles