కేసీఆర్ ప్రభుత్వం మీద అసమ్మతి నేతలు తమ గళాన్ని విప్పుతున్నారు. కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి లాంటి నేతలు అయితే కేసీఆర్ ను బండ బూతులు తిడితే.. తాజాగా మరో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్.. ఓ పిచ్చి ముఖ్యమంత్రి. గ్రామగ్రామాన తన్ని రాజీనామా చేయించండి అని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ అతి తెలివిమంతునిగా వ్యవహరిస్తూ... పైగా నీటిపారుదల అధికారులకు తెలివి లేదనుకుంటున్నారని విమర్శించారు. సగం తెలివితో కేసీఆర్ ప్రమాదకర వ్యక్తిగా తయారయ్యారన్నారు. గత 18 నెలల టీఆర్ఎస్ పాలన అట్టర్ ఫ్లాప్ అని, సీఎం ఆధునిక తుగ్లక్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిజానికి తుగ్లక్ ఉద్దేశాలు బాగున్నా... అమలు చేయడంలో విఫలం అయ్యారని అన్నారు. కానీ కేసీఆర్ విషయంలో అవి అమలే కావని విమర్శించారు
రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాక నష్టపరిహారం ఇస్తే ఏం లాభం? ఆత్మహత్యలు జరగక ముందే ఆదుకోవాలని కేసీఆర్పై మండిపడ్డారు పాల్వాయి గోవర్థన్ రెడ్డి. ఏపీ, తెలంగాణలో ఆత్మహత్యల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని, రుణ మాఫీని రెండు రాష్ట్రాలూ సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. చంద్రబాబు, ఎన్టీఆర్లు శ్రీశైలం టన్నెల్ వద్దన్నా... కష్టపడి దాన్ని సాధించామని, దాని పనులు 80 శాతం పూర్తయ్యాయని, మరో 20 శాతం పనులు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోందని విమర్శించారు.డిండి వద్ద నక్కలగండి ప్రాజెక్టు కట్టి అక్కడ నుంచి చెరువులకు నీరు పంపించాలని, దాని వల్ల నల్గొండ జిల్లాకు సాగు నీరు, త్రాగు నీరు లభిస్తుందని తెలిపారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ను అడ్డం పెట్టుకొని వైఎస్ నక్కలగండికి...గండి కొట్టారని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మించలేకపోతుందని ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more