ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ప్రత్యేక హోదాపైనే నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆధారపడి ఉందని అందుకోసం ఎంతకైనా పోరాడదామని జగన్ పిలుపునిచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు నల్లపాడు రోడ్డులో నిరవధిక నిరాహార దీక్షకి దిగారు. ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జగన్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి 90 శాతం గ్రాంటు రూపంలో నిధులు వస్తాయన్నారు. పది శాతం లోను వస్తుందన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమల ఆదాయానికి పన్ను, ఎక్సైజ్ డ్యూటీలకు మినహాయింపు ఉంటుందని, మరో 20 ఏళ్ళ పాటు విద్యుత్ చార్జీలు సగం ధరే చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. తద్వారా దేశ విదే శాల నుంచి పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారని పేర్కొన్నారు. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున వస్తాయని తెలిపారు. ఇవన్నీ తెలిసిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై నోరు విప్పకపోవటం దౌర్భాగ్యమన్నారు. ప్రత్యేక హోదా సాధించుకునే వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
కేంద్రానికి చంద్రబాబు అల్టిమేటం ఇచ్చి... కేంద్రం మీద వత్తిడి తీసుకువస్తే ఖచ్చితంగా దిగివచ్చి ప్రత్యేక హోదా ఇస్తుందని జగన్ అన్నారు. అలా చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని,అలా అల్టిమేటం ఇచ్చిన 24 గంటలలోపు జైలుకు వెళతానేమోనని ఆయన భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో మనం పోరాటం ఆపకూడదని, చంద్రబాబు మనసు మార్చుకుని కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తెచ్చేవరకూ పోరు కొనసాగుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో అపారమైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. ‘నో వేకెన్సీ’ బోర్డు కనిపించదన్నారు. రాష్ట్రానికి అక్షరాలా సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం తాను చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more