విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే.. ఆర్థిక ఇబ్బందుల్లో పీకల్లోతు మునిగిపోయి ఏపీ.. ఈ విషయంలో మరింత వేగంగా పావులు కదుపుతోంది. ఏపీ ప్రభుత్వంతో సింగపూర్ తో సన్నిహిత సంబంధం ఎక్కువగా వున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలాగే.. చైనా కూడా పలు సంస్థల్ని ఆ రాష్ట్రంలో నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మరోవైపు తెలంగాణ ఇప్పుడిప్పుడే పెట్టుబడులు రాబట్టే విషయమై ప్రయత్నాలు చేస్తోంది. ఏదేమైనా.. ఈ రెండు రాష్ట్రాల్లో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో ఏపీ ప్రభుత్వమే ముందుందని విశ్లేషకులు భావిస్తుండగా.. ఇది నిజమేనని ప్రపంచ బ్యాంకు ధృవీకరించింది.
భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల రాష్ట్రాల జాబితాను ప్రపంచబ్యాంకు తాజాగా విడుదల చేసింది. ఈ ర్యాంకుల్లో అగ్రస్థానలో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ నిలవగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. మూడో స్థానంలో జార్ఖండ్ రాష్ట్రం సంపాదించుకుంది. ఇక తెలంగాణ రాష్ట్రం మాత్రం 13వ స్థానంలో నిలిచింది. పెట్టుబడులను ఆహ్వానించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రయత్నిస్తుండగా.. ఆ రెండింటిలో ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు మరింత అనువుగా వుందని ఈ జాబితాను బట్టి అర్థమవుతోంది. ఈ జాబితా అంతర్జాతీయ వ్యాపార వేత్తలను ప్రభావితం చేసే అవకాశమూ లేకపోలేదు. ఈ ర్యాంకింగ్స్ ఆధారంగా ఏపీలో మరిన్ని కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు వీలుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ బ్యాంక్ ఆశలు రేపింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more