అటు రాజధాని నిర్మాణం, భూసేకరణ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు . భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసినా...వీలైనంత వరకు సమీకరణనకే రైతులను ఒప్పించాలని సూచించారు. అలాగే కేపిటల్ నిర్మాణంతో జరిగే మేలును మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులు, అధికారులుకు సూచించారు .విజయవాడ క్యాంపు ఆఫీస్ లో పలు అంశాలపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. సీఆర్డీఏపై నిర్వహించిన సమావేశానికి మంత్రి నారాయణ, గుంటూరు జిల్లా కలెక్టర్ తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. భూసేకరణ ద్వారా సేకరించాల్సిన ౩వేల ఎకరాలు, నోటిఫికేషన్ వంటి అంశాలను గురించి అధికారులతో చర్చించారు సీఎం. నోటిపిషకేషన్ తర్వాత రైతులు, ప్రజలు, విపక్షాల నుంచి వస్తున్న వ్యతిరేకతను అడిగి తెలుసుకున్నారు. అలాగే అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూసేకరణతో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున వీలైనంత వరకు సమీకరణకే ఒప్పించేలా చూడాలని చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా ఎన్నికల సమయంలో తమకు అండగా ఉన్న పవన్ కళ్యాణ్ భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. రైతుల నుండి బలవంతంగా భూములు సేకరించడం మీద ఇప్పటికే తన నిరసన తెలిపారు. రైతుల నుండి భూములు లాక్కోవద్దు అని రిక్వెస్ట్ చేస్తూనే.. లాక్కుంటే ఊరుకునేది లేదు మరోసారి రైతులను తాను కలుస్తానని చెప్పడంతో ఏపి ప్రభుత్వం డైలమాలో పడింది. ఏం చెయ్యాలో ఏపి ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. తమ ప్రభుత్వానికి ప్రతిపక్షపార్టీల కన్నా పవన్ భయం ఎక్కువగా ఉంది అని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారట. ఏపీ రాజధానికి భూమల కోసం భూసేకరణ చట్ట ప్రయోగంపై పవన్ చేసిన వ్యాఖ్యల మీద టీడీపీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎలా రియాక్ట్ కావాలనే అంశంపై పార్టీ, ప్రభుత్వ పెద్దలు చర్చించారు. పవన్ దూకుడుగా ఉన్నా.... నేతలు సమన్వయం పాటించాలని అధిష్టానం సూచించింది. అమరావతికి భూసేకరణపై ఏపీ ప్రభుత్వం ముందుకే వెళుతోంది. నోటిఫికేషన్ ఇచ్చి భూ సేకరణకు నాంది పలికింది. ప్రభుత్వం ఎందుకు సేకరణకు వెళ్లాల్సి వస్తోందనే విషయం ప్రజలకు చెపితే చాలన్నారు. మంత్రులు సైతం పవన్ వ్యాఖ్యలపై ఆచి తూచి స్పందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more