జగన్ ఆస్తుల కేసులో మరో కీలక పరిణామం. ఇకపై ప్రతి శుక్రవారం విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. ట్రయల్ విచారణ వీలైనంత త్వరగా పూర్తయితే...ఈ కేసులో తుది తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది. జగన్ ఆస్తులకేసు దర్యాప్తు ప్రారంభమై ఇప్పటికే నాలుగేళ్లు పూర్తయిపోయింది. 2011 ఆగస్టు 17వతేదీన ఈకేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పటి నుంచి విచారణ సాగుతూనే ఉంది. ఏ1 నిందితుడు జగన్మోహన్ రెడ్డి నుంచి పలువురు నిందితులు ఏడాదికిపైగానే జైలు జీవితం గడిపారు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటులు దాఖలవగా కొన్ని రోజుల క్రితం అభియోగ నమోదు ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ట్రయల్ విచారణ ఆలస్యమవుతుందని భావించిన సీబీఐ నాంపల్లి సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. డిశ్చార్జి పిటిషన్ లను త్వరగా తేల్చాలన్న హైకోర్టు ఆదేశాలను సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
సీబీఐ మెమోపై స్పందించిన కోర్టు విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇకపై ప్రతి శుక్రవారం జగన్ ఆస్తుల కేసును విచారించాలని నిర్ణయం తీసుకుంది. సీబీఐ కోర్టు నిర్ణయంతో జగన్ ఆస్తుల కేసు విచారణ వేగంవంతం కానుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులపై ఉన్న అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. వాటిపై అభ్యర్ధనల రూపంలో ఉన్న డిశ్చార్జిపిటిషన్ లపై వాదనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి శుక్రవారం విచారణ జరపాలని నిర్ణయంతో అవన్నీ త్వరలోనే పరిష్కారం కానున్నాయి. ట్రయల్ త్వరితగతిన పూర్తైతే తుది తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more