అవినీతి జరుగుతున్న చోట న్యాయానికి చోటు లేదని పెద్దలు అంటుంటారు. అవును.. ఈ మాటలు నూటికినూరు శాతం నిజమని ప్రతిఒక్కరు ఒప్పుకోక తప్పదు. ఇందుకు నిదర్శనంగా ఇదివరకే ఎన్నో ఘటనలు చోటు చేసుకోగా.. తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన కళ్లముందు జరుగుతున్న అవినీతిని ఎండగట్టేందుకు యత్నించిన ఓ జర్నలిస్టు కొంప కొల్లేరయ్యింది. ఓ భారతీయ పౌరుడిగా సక్రమంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఆ విలేకరికి చేదు అనుభవమే మిగిలింది. అతడు చేసిన సాహసానికి మెచ్చుకోవాల్సిన ప్రభుత్వమే అతనికి బజారులోకి ఈడ్చుకొచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ లో విలేకరిగా పనిచేస్తున్న అశోక్ పాండే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా ప్రసిద్ధి చెందారు. ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మహమ్మద్ షాహిద్ లిక్కర్ మాఫియాకు చెందిన కొంతమంది వ్యాపారులతో మద్యం లైసెన్సుల గురించి బేరసారాలు సాగించారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న అశోక్ పాండే.. వారిమధ్య జరుగుతున్న ‘అవినీతి’ బేరసారాలను బట్టబయలు చేయాలని నిర్ణయించారు. ఆయన అనుకున్నట్లుగా ‘స్టింగ్ ఆపరేషన్’ చేసి మరీ ఈ తతంగాన్ని రికార్డు చేశారు. అంతేకాదు.. సదరు భాగోతాన్ని బట్టబయలు చేశారు. అంతే! ఇక అప్పటినుంచి ఆ జర్నలిస్టుకు కష్టాలు మొదలయ్యాయి.
అప్పటిదాకా అన్నీ సవ్యంగానే ఉన్న అశోక్ పాండే ఇంటిని ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వెంటనే ముస్సోరి-డెహ్రాడూన్ డెవలప్ మెంట్ అథారిటీ(ఎంఎండీఏ)కి చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఎంఎండీఏ మంగళవారం అశోక్ పాండే ఇంటిలోని కొంత భాగాన్ని కూల్చేసింది. దీంతో ఆ విలేకరి తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more