సొమ్మొకడిది.. సోకొకడిది అనే సామెత అందరికి తెలిసే ఉంటుంది. ఎవరికో చెందిన వాటి మీద ఎవరో అజమాయిషీ చెలాయిస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ పరిస్థితి అసలే బాగోలేదు.. ఖజానాలో కాసులు లేక దివాళా దిశగా అడుగులు వేస్తోంది కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఖజానా పరిస్థితిని పట్టించుకోకుండా ఖర్చు మీద ఖర్చు చేసేస్తున్నారు. ఇంతకీ సార్ గారు ఏం చేశారు అనేగా మీ అనుమానం. ఖరీదైన కోట్ల విలువ చేసే కార్లను సిఎం కాన్వాయ్ లోకి తీసుకున్నారు కేసీఆర్. అవును అందులో తప్పు ఏముంది అనుకుంటున్నారా....? ఆగండి సార్ ఒక్క కారుకు ఖర్చు చేసింది ఎంతో తెలుసా..? అక్షరాల నాలుగుకోట్ల 38 లక్షల రూపాయలు. అవును నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలే. అసలే కాసులకు కటకట ఉంటే కేసీఆర్ మాత్రం బిల్డప్ కోసం కొత్త కార్లు కొన్నారని అపవాదు మూటగట్టుకున్నారు.
.Also Read : కేసీఆర్ బస్సు 5 కోట్లు.. మరి చంద్రబాబు బస్సు...?
తెలంగాణ రాష్ట్రం నిజానికి దేశంలో మిగులు బడ్జెట్ కలిగి ఉన్న రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. కానీ గత కొంత కాలంగా ప్రభుత్వం చేస్తున్న అనవర ఖర్చు ప్రభుత్వానికి రూపాయి మిగలకుండా చేస్తోంది. అవసరమైన దాని కన్నా అతిగా ఖర్చు చెయ్యడం కేసీఆర్ సర్కార్ కు అలవాటుగా మారింది. అందుకే ప్రస్తుతం తెలంగాణ ఖజానా కాసులు లేక వెలవెలబోతోంది. అయినా ఇంత తడిసిమోపడవుతున్నా కేసీఆర్ మాత్రం తన పంధా మార్చుకోవడం లేదు. తాజాగా నాలుగు కొత్త కార్లను కొని తన కాన్వాయ్ లోకి చేర్చారు.
.Also Read : కేసీఆర్ బస్సు.. ఐదు కోట్లు కానీ కనీసం బెడ్ కూడా లేదు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాన్వాయ్ ముచ్చటగా మూడోసారి మారింది. అత్యాధునిక భద్రతతో పాటు… అత్యంత ఖరీదైన వాహనాలు సీఎం కాన్వాయ్ లో కనిపించనున్నాయి. దేశంలో ప్రధాని, రాష్ట్రపతి తర్వాత అత్యంత ఖరీదైన కాన్వాయ్ ని కేసీఆర్ మాత్రమే వాడుతున్నట్టు సమాచారం. ఇప్పటిదాకా టయోటా కంపెనీకి చెందిన ఫార్చూనర్లనే వాడుతూ వస్తున్న కేసీఆర్, తన పంథా మార్చారు. ఫార్చూనర్ల స్థానంలో అత్యంత ఖరీదైన వాహనాలుగా పేరుపడ్డ ల్యాండ్ క్రూయిజర్లను కేసీఆర్ ఎంచుకున్నారు. ఒక్కోటి రూ.1.30 కోట్ల విలువ కలిగిన ఐదు ల్యాండ్ క్రూయిజర్ వాహనాలు ఆయన కాన్వాయ్ లో చేరిపోయాయి. తద్వారా అత్యంత ఖరీదైన వాహన శ్రేణి కలిగిన సీఎంల జాబితాలో కేసీఆర్ చేరిపోయారు.అత్యంత ఖరీదు పెట్టడమే కాక ఈ వాహనాలను బుల్లెట్ ప్రూఫ్ కూడా చేయించారట. ఇక ఇప్పటిదాకా వాడిన ఫార్చూనర్లు నలుపు రంగులో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇవి తెలుపు రంగులోకి మారిపోయాయి. తాజాగా కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూయిజర్లు కూడా తెలుగు రంగులోనే కేసీఆర్ కాన్వాయ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. యాదగిరిగుట్టలో కొత్త ల్యాండ్ క్రూయిజర్లకు ప్రత్యేక పూజలు చేయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more