ఇవాళ తెలంగాణకు మిగులు ఆదాయం ఉందంటే అది తన వల్లే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి చెప్పారు. ఆనాడు తాను రూపొందించిన విజన్ వల్లే.. ఇవాళ అభివృద్ధిలో హైదరాబాద్ దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉందని ఆయన అన్నారు. రాజమండ్రిలో పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్దిపై ఆయన చర్చించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో నాల్డెజ్ బేస్ ఎకానమీ, ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని.. నేడు అదే హైదరాబాద్ కు ప్రధాన ఆదాయాన్ని చేకూరుస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తాతాల్కిక సమస్యల్లో ఉందన్నారు చంద్రబాబు.
Also Read: అదిరిపోయేలా.. అపూర్వంగా అమరావతి నిర్మాణం: బాబు
రెవెన్యూ లోటు ఉంటుందని 14th ఫైనాన్స్ కమిషన్, విభజన చట్టం చెప్పయని ఆయన గుర్తు చేశారు. అయితే పారిశ్రామిక్తవేత్తలు కలిసి వస్తే.. దేశంలోనే ఏపీని నెంబర్ 1 చేసే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా పోర్టు ఉండాలని చంద్రబాబు అన్నారు. ఇవాళ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు చైనా, సింగపూర్, మలేసియా.. ఇలా ఏవి చూసినా.. ఆయా దేశాలకు పోర్టులు ఉండటమే ప్రధాన కారణం అన్నారు. అందుకే ఏపీకి కూడా డెవలప్ కావాలంటే పోర్టు తప్పనిసరి అన్నారు చంద్రబాబు. ఏపీలో సహజ వనరులకు కొదవలేదన్న చంద్రబాబు.. మనమంతా సమిష్టిగా పని చేస్తే దేశంలోనే ఏపీ నెంబర్ వన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక గోదావరి పుష్కరాలకు అనూహ్య స్పందన వచ్చిందని, ఇప్పటివరకు 3 కోట్ల మందికిపైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారని చంద్రబాబు వెల్లడించారు.
Also Read: చంద్రబాబు అంతే చెప్పారంటున్న బోయపాటి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more