ఆ మధ్య ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగు చూసిన ఉపాధ్యాయుల భాగోతం తాజాగా పంజాబ్ లోనూ రిపీట్ అయ్యింది. వారు విద్యార్థులకు బోధిస్తున్న పాఠ్యాంశాలపైనే వారికి అవగాహన లేకపోవడం..బావితరాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లో గణితం భోధించే మాస్టార్లకు కనీసం ఎక్కాలు తెలియకపోవడం, చిన్న పాటీ కూడికలను కూడా వారు తప్పుగా చేయడం పలువుర్ని విస్మయానికి గురి చేసింది. కాగా, తాజాగా పంజాబ్ లో ఆంగ్ల పాఠ్యాంశాలను భోధిస్తున్న ఉపాధ్యయులకు కూడా వారు బోధించే పాఠ్యాంశాలపై అవాగాహనా లేకపోవడం, అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలతో రాయడంతో.. పంజాబ్ విద్యా శాఖ అధికారులే ఖంగు తిన్నారట.
తాజాగా కొంత మంది ఇంగ్లీష్ టీచర్లకు అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించగా పంజాబ్ విద్యాశాఖ అధికారులు విస్తుపోయారు. సుమారుగా 220 మంది ఆంగ్ల బాష టీచర్లకు ఈ పరీక్షలు నిర్వహించారు అధికారులు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలు మొదలు కోని దాదాపు అన్ని పదాలు తప్పుగా రాసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చలిత్ సింగ్ చీమా తెలిపారు. టీచర్లు చేసిన తప్పిదాలను వారు పాఠశఆలలకు తిరిగి వెళ్లిన తరువాత తెలుసుకుంటారని తాము ఆశిస్తున్నట్లు ఆయన పేర్కోన్నారు.
అసలు ఈ విషయం ఎలా వెలుగుచూసిందంటే.. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో అత్యధిక శాతం మంది ఇంగ్లీష్ బాషలో తప్పడంతో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మూడు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో ఎనభై వేల మందికి పైగా పరీక్షల్లో తప్పారు. ఒక సబెక్టులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిల్ కావడంతో.. తప్పు ఎక్కడ జరిగిందన్న విషయంలో విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మొహలీ పట్టణంలో టీచర్లతో విద్యాశాఖ సమావేశం నిర్వహించింది. అక్కడ వారికి పరీక్షలు నిర్వహించగా.. అసలు లోసుగులు భయటకు వచ్చాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more