రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పనులపై దృష్టి సారించిన విషయం తెలిసిందే! ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను తమ రాష్ట్రాలవైపు ఆకర్షించేందుకు రెండు రాష్ట్రాలు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే పారిశ్రామికవేత్తలతో ఆయా రాష్ట్రాలు సంప్రదింపులు జరుపుకుంటున్నాయి. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఈ రెండు రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించే పనిలో భాగంగా ఎవరెవరితో సంప్రదింపులు జరుపుకుంటున్నాయన్న విషయంలో ఒకదానిపై మరొకటి నిఘా వేసుకున్న పరిస్థితి నెలకొంది. అంటే.. ఒక రాష్ట్రం ఏ కంపెనీతో సంప్రదింపులు జరుపుతుందో అదే కంపెనీతో మరో రాష్ట్రం మంతనాలు జరిపి తమవైపుకు తన్నుకుపోతున్నారు. ఇందుకు నిదర్శనంగా రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి.
గతంలో హీరో మోటార్ కార్ప్ పరిశ్రమను రాబట్టుకునే విషయంలో రెండు రాష్ట్రాలు బాగానే పోటీపడ్డాయి. తొలుత దీనిని తమవైపుకు ఆకర్షించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ బాగానే కసరత్తులు చేశారు. అయితే.. అదే పరిశ్రమతో ఏపీ కూడా మంతనాలు జరిపింది. ఇందులో భాగంగానే ఏపీ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా వున్న జేఎస్వీ ప్రసాద్.. తన తెలివితో ఆ పరిశ్రమను ఏపీకి తరలించుకుపోయారు. దీంతో తెలంగాణ సర్కార్ ఏపీ మీద కాస్త ఇబ్బందిపడింది. తమకు దక్కాల్సిన పరిశ్రమను ఏపీ తీసుకుపోయిందని తెలంగాణ జీర్ణించుకోలేకపోయింది. తమకూ సమయం వస్తుందని కదా వేచి చూడగా.. చివరికి ఆ టైమ్ వచ్చేసింది. తెలంగాణ కూడా ఏపీకి దక్కాల్సిన ఓ అంతర్జాతీయ సంస్థను సునాయాసంగా ఎగురేసుకుపోయింది. ఈ విషయంలో కేటీఆర్ బాగానే కష్టపడ్డారని తెలుస్తోంది.
ఇటీవల మైక్రోమ్యాక్స్ తో ఏపీ సర్కార్ చర్చలు జరిపింది. ఆ సంస్థ కర్మాగారాన్ని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయించే దిశగా దాదాపుగా ఒప్పందం కుదుర్చుకుందట! అయితే.. ఈ విషయాన్ని ఎలాగోలా తెలుసుకున్న తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్.. రంగంలోకి దిగిపోయారు. మైక్రోమ్యాక్స్ సంస్థ యాజమాన్యంతో కేటీఆర్ చర్చలు జరిపి.. ఏపీలో పెట్టాలనుకుంటున్న కర్మాగారాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేలా ఒప్పించారని సమాచారం! ఈ విషయం తెలుసుకున్న ఏపీ సర్కార్.. ఇకపై పారిశ్రామికవేత్తలతో జరిపే చర్చలను రహస్యంగా వుంచాలని నిర్ణయించిందని తెలిసింది. ఇలా పరిశ్రమలను ‘ఎగిరేసుకుపోయే’ రగడ ఎన్నాళ్లవరకు కొనసాగుతుందో!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more