రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా హైదరాబాద్లో శాంతిభద్రతలను గవర్నర్ పర్యవేక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. విభజన చట్టంలోని సెక్షన్-8ని పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు పోరాడాలని సంకల్పించారు. భారత అటార్నీ జనరల్ సెక్షన్-8పై వెలిబుచ్చిన అభిప్రా యాలను స్వాగతించిన ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసే దాకా అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ఓటుకు నోటు వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారింది. ఓటుకు నోటు నుండి ట్యాపింగ్ కు ట్యాపింగ్ నుండి సెక్షన్8 కు పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
సెక్షన్-8పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్తో సమావేశ మైన విషయం తెలుసుకున్న చంద్రబాబు అదే సమ యంలో అందుబాటులో ఉన్న మంత్రులతో ప్రత్యేకంగా భేటీ నిర్వహించారు. సెక్షన్-8ని రాద్దాంతం చేసేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారని, ఈ ప్రతిపాదనను ధీటుగా ఎదుర్కోవాలని దిశా నిర్దేశం చేశారు. అవసరమైతే మరోసారి ఢిల్లి వెళ్లి ఇదే అంశంపై ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం కావాలని నిర్ణయించారు. ఏడాది కాలంగా గుర్తుకు రాని సెక్షన్-8ని ఓటుకు నోటు వ్యవహారం బయటపడ్డాకే ఢిల్లిd వెళ్లి ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని నిర్ణయించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more