ఏకే ఖాన్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన పేరు. ఓటుకు నోటు వ్యవహారంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న ఏసీబీకి ప్రస్తుతం డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ సర్కార్ కు లాభం చేకూరేలా.. ఏపి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ నేతలకు తలనొప్పి గా మారింది. అయితే తాజాగా ఏసీబీ డిజిగా పనిచేస్తున్న ఏకే ఖాన్ ను తెలంగాణ డిజిపిగా నియమించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచెసేందకు అన్ని ఏర్పాట్లు చేప్తున్నారు. తెలంగాణ సర్కార్ ఆ దిశగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం తాత్కాలిక డిజిపిగా అనురాగ్ శర్మను నియమించింది. అయితే పూర్తి స్థాయి డిజిపిగా ఏకే ఖాన్ ను నియమించేందుకు ప్రపోజల్ సిద్దం చేస్తోంది. అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య సాగుతున్న ఓటుకు నోటు వ్యవహారం పీక్స్ లో ఉండగా కేసీఆర్ కావాలనే ఏకే ఖాన్ ను డిజిపిగా నియమించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ సర్కార్ ఏర్పడి ఏడాది గడిచిపో యినా అనురాగ్ శర్మను ఇంకెంత కాలం తాత్కాలిక డిజిపిగా కొనసాగిస్తారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, యూపీఎస్సీ సర్కార్కు మొట్టికాయ వేసింది. ఒకవేళ అనురాగ్ శర్మను శాశ్వతంగా కొనసాగించాలనుకుంటే అధికారికంగా పేరును ఖరారు చేసి ఫైలు పంపించండి, లేదంటే కొత్త డిజిపి కోసం సీనియర్ ఐపిఎస్ల పేర్లు పంపించండని యూపీఎస్సీ లేఖ పంపించింది. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మూడు నాలుగు నెలల క్రితం ఆరుగురు సీని యర్ ఐపిఎస్ల పేర్లను జోడించి లిస్టును ప్రిపేర్ చేసి యూపీ ఎస్సీకి పంపించింది.. అయితే రెండు రోజుల క్రితం ఫైల్ను తిరిగి పంపిస్తూ ఐపి ఎస్ల పేర్లలో ఏకే.ఖాన్, అరుణా బహుగుణ పేర్లు సరిగా లేవు కాబట్టి వివరాలు సేకరించి పూర్తి పేర్లను నమోదు చేసి పంపించాలని సర్కార్కు తిరిగి పంపించినట్లు తెలిసింది. అరుణా బహుగుణ డిజిపి రేసులోంచి తప్పుకుం టున్న నేపథ్యంలో ఏకే.ఖాన్కు డిజిపి పదోన్నతి లభించనున్నట్లు తెలిసింది. ఏసిబి డిజిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఏకే.ఖాన్ను తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయన్ను ఏసిబి డిజిగా నియమించారు. ఇటీవల ఓటుకు నోటు వ్యవ హారం లో టిడిపి ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని రెడ్హాం డెడ్గా పట్టుకున్న ఏకే.ఖాన్ రాష్ట్రంలో అవినీతి డిపార్టు మెంట్లు, అధికారుల పేర్లను సేకరించి వారిపై నిఘా పెట్టడమే కాకుండా ఏసిబి డిజిగా సమర్ధ వంతంగా పనిచేస్తున్నందున ఆయన్నే డిజిపిగా నియమించుకునే విధంగా కేసిఆర్ కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more