ఏపీ మంత్రి పీతలకు కాలం అంతగా కలిసి రావడం లేదనిపిస్తోంది. ఇటీవలే ఆమె ఇంట్లో నోట్లమూట కనిపించిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపగా.. తాజాగా ఈమె మరో వివాదంలో చిక్కుకుంది. ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న ‘లంచం’ ఉచ్చులో పీతల హస్తమున్నట్లు స్వయంగా ఆ ఉద్యోగియే వెల్లడించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో మంత్రి పీతల తీవ్ర ఆందోళనల్లో మునిగిపోయినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా మహిళా-శిశు సంక్షేమ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఉండ్రాజవరపు జెస్సీ డైమండ్ రోసీ సోమవారంనాడు సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము తిరిగి ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఈ విషయంపై ఆమెను విచారించగా.. తాను ఆ లంచం తన కోసం కాదని, మంత్రి పీతల, ఆమె కుటుంబసభ్యుల ఖర్చుల కోసం వసూలు చేస్తున్నానంటూ చెప్పినట్లు సమాచారం.
పైగా మంత్రి కోసం ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టాననే వివరాలు నమోదు చేసిన ఒక డైరీని ఏసీబీ అధికారులకు చూపించినట్లు తెలిసింది. మంత్రి ఖర్చుల వివరాల డైరీని స్వాధీనం చేసుకుని, ఈ విషయాన్ని హైదరాబాద్లోని ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు అంశాలను గోప్యంగా వుంచినట్లు తెలుస్తోంది. ఆ మహిళా ఉద్యోగిని చెప్పేది నిజమైతే.. మంత్రి పీతల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more