రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న మైనర్ బాలిక అత్యాచార, హత్య కేసును జిల్లా పోలీసులు చేధించారు. మనుషులమని చెప్పుకునేందుకు వీలు లేకుండా, మానవీయతకే మచ్చ తీసుకువచ్చేలా.. ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు., కన్న పేగు పైనే కామవాంఛతో పశువులా దూకితే.. ఆ తండ్రిని ఒకసారి ఎదుర్కోని.. మరోసారి పరాజయం పోంది అసువులు బాసింది. అత్యాచారా ఘటనలతో యావత్ భారత్ ఖంగుతింటున్న సమయంలో తమ బిడ్డలను ఎలా రక్షించుకోవాలన్న చర్యలకు ఉపక్రమిస్తున్న తండ్రులు ఆందోళన చెందుతున్న తరుణంలో.. సమాజంలోనే కాదు కనీసం తన ఇంట్లో కూడా తమకు రక్షణ లేదని.. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులే తమను హతమారుస్తున్నారని మహిళా సమాజం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తుంది.
మనుషులనే కనక జీవసమాధి చేస్తేలా న్యాయం తీర్పునిస్తే.. ఇలాంటి రాక్షసులకు ముందుగా సమాధి చేయాలని మహిళాలోకం అక్రోశాన్ని వ్యక్తం చేస్తుంది. రంగారెడ్డి జిల్లా బంట్వారంలో జరిగిన మైనర్ గిరిజన బాలిక అత్యాచారం కేసులో.. తప్ప తాగి.. మైకంలో మృగంలా ప్రపర్తించానని బాలిక తండ్రి మెకావత్ కమల్ విచారణలో భాగంగా అంగీకరించాడని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మెకావత్ కమల్ పోలీసులను తప్పదారిపట్టించాడని, అతని పలుమార్లు విచారించిన సమయంలో పోంతన లేని సమాధానాలతో చెప్పడంతో అతనిపై అనుమానాలు వచ్చాయని పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన అనంతరం అతని సమాధానాలపై అనుమానం వ్యక్తం చేసిన బాలిక తల్లి మరికొందరితో కలసి పోలిస్ స్టేషన్ కు బయలు దేరగా, వారితో కలసి వచ్చి తన తప్పులేదని తండ్రి నటించాడని పోలీసులు తెలిపారు. చందానగర్ లోని తన బందువుల ఇంటి నుంచి రైల్వే స్టేషన్ లో దిగిన పోలీసులు వారినెవరైనా వెంబడించారా అన్న పూటేజ్ ను పరిశీలించారు. ఆ తరువాత మెకావత్ కమల్ సెల్ పోన్ పరిశీలించగా అది ఘటన జరిగిన స్థలంలో 8.57 నిమిషాల నుంచి 11.37 నిమిషాల వరకు వున్నట్లు కనుగోన్న పోలీసలు విచారించగా తానే కూతురిపై అత్యాచారం చేశానని అంగీకరించినట్లు తెలిపారు.
వికారాబాద్ లో మద్యం సేవించిన కమల్ తన కూతురిని వెనక మగపిల్లల మాదిరిగా కూర్చోబెట్టుకుని వెళ్లాడు. దీంతో అమె వెనక నుంచి తండ్రిని పట్టుకోవడంతో అతను నియంత్రణ కోల్పోయి తన కూతురిని ఇజ్రా చిట్టంపల్లి వద్ద తొలుత అత్యాచారం చేయాలనుకున్నానాని, అయితే అక్కడ పరిస్థితులు బాగోలేవని ఘటనాస్థలానికి తీసుకెళ్లి అత్యాచర యత్నం చేశానని అంగీకరించాడు. అయితే ఆ తరువాత క్షమాపణలు చెప్పి తనను ఎక్కించుకుని కుడి వైపుకు తిరిగి తన కూతురిని లాక్కుని తీసుకెళ్లానని.. అక్రమంలో అమె చిన్న రాయితో తనపై దాడి చేయడంతో.. తాను పెద్ద బండరాయితో అమెపై దాడి చేసి హతమార్చానని.. అయినా చనిపోలేదని తెలిసి గోంతునులిమి చంపానని మెకావత్ కమల్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
పశువులా కన్న కూతరిని చెరబట్టి,, కామవాంఛతో దాడి చేసి హతమార్చిన క్రమంలో అమె తన తండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డటాన్ని జీర్ణించుకోలేక ఆ చిన్నారి పెట్టిన ఆర్తనాధాలు కూడా ఆ తండ్రి హృదయంలో కరుణ చూపలేదు. వద్దు నాన్నా, వద్దు నాన్నా.. అంటూ అమె అరచిన అరుపులన్నీ అరణ్య రోదనలే అయ్యాయి. కేవలం తన భార్యకు విషయం చెబుతుందని, దీంతో గ్రామంలో తన పరువు పోతుందనే భయంతోనే తాను తన కూతురిని హత్య చేశానని నిందితుడు మెకావత్ కమల్ తెలిపాడని పోలీసులు చెప్పారు.
.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more