కొత్త సీసాలో పాత సరుకు అన్న సామెతకు మారుతున్న రాజకీయాలకు బాగా అబ్బుతాయి. అప్పుడెప్పుడో ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన పార్టీలు కేంద్రంలో కాంగ్రెస్, బిజెపిని కాదని చక్రం తిప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సారథ్యంలో ఆరు పార్టీలతో కూడిన జనతా పరివార్ నేడు ఆవిర్భవిస్తోంది. పలు రాష్ట్రాల అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఈ ఏడాదే బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.ములాయం నివాసంలో జరిగే ఈ సమావేశంలో కొత్త కూటమికి ఏ పేరుపెట్టాలి అన్నదానిపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పార్టీ గుర్తుపైనా సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్, జెడియు చీఫ్ శరద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి, జెడిఎస్ చీఫ్, మాజీ ప్రధాని దెవేగౌడ, ఆర్జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్వాదీ జనతా పార్టీ చీఫ్ కమల్ మొరార్క్, ఐఎన్ఎల్డి నేత దుశ్యంత్ చౌతాలాలతోపాటు ములాయం సోదరుడు రామ్గోపాల్ యాదవ్ హాజరుకానున్నారు.
జనతా పరివార్ మహా కూటమికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ ప్రత్యేక భూమిక పోషిస్తారు. మంగళవారం సాయంత్రానికే కుమార్ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ‘జనతా పరివార్ కూటమికి సంబంధించి ఆరు పార్టీల నాయకులు ఈపాటికే పలుదఫాలు చర్చించుకున్నారు. పలు అంశాలపై ఓ అభిప్రాయానికి వచ్చారు. బుధవారం నాటి సమావేశమే కీలకం’ అని కెసి త్యాగి వెల్లడించారు. ఎన్నికల గుర్తుపై చర్చించిన తరవాత ఓ నిర్ణయానికి రావచ్చని, బహుశా సైకిల్ గుర్తు ఖరారు కావచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 5న ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ నినాదం ఇచ్చారు. ‘ఏక్ జండా..ఏక్ నిషాన్’ అంటూ లాలూ ప్రకటించడం గమనార్హం. జనతా పరివార్ ఏర్పాటయితే బీహార్లో బిజెపిని నామమాత్రం చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సారథ్యంలో ఆరు పార్టీల పరివార్ పనిచేస్తుందని లాలూ తెలిపారు. ‘విలీనమంటే విలీనమే అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు’ అని ఆర్జెడి అధినేత స్పష్టం చేశారు. పార్టీ గుర్తుపైనే స్పష్టత లేదుతప్ప మిగతా అన్నింటిలోనూ ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన అన్నారు. లౌకికవాద పార్టీలతోనూ కలిసి పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లాలూ పేర్కొన్నారు. మరి ఈ దోస్తీ ఎన్నాళ్లు ఉంటుంది... ఎన్నికల వరకు ఎలాంటి విభేదాలు లేకుండా వీరు కలిసే ఉంటారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more