పార్టీని ముందుకు తీసుకువెళతాడు అనుకున్న రాహుల్ బాబు ఇప్పుడు అదే పార్టీని ముంచుతాడు అంటూ అప్పుడూ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. రాహుల్ కంటే సోనియానే బెటర్ అంటూ కాంగ్రెస్ నాయకులు పాత స్వరాన్ని పాడుతున్నారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల కాంగ్రెస్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. కాంగ్రెస్కు సోనియా గాంధీ నాయకత్వం కొనసాగాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రకటించారు. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా నియమించకూడదని సీనియర్ నాయకుడు క్యాప్టెన్ అమరీందర్సింగ్ బహిరంగంగా ప్రకటించిన రెండు రోజులకే షీలాదీక్షిత్ ఈ ప్రకటన చేయటం గమనార్హం. సోనియా గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సాధించుకోగలుగుతుందని షీలాదీక్షిత్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పట్ల తనకున్న బాధ్యత నుండి సోనియా గాంధీ పారిపోకూడదని దీక్షిత్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా నియమిస్తే మెజారిటీ సీనియర్ నాయకులు వేరేదారి చూసుకుంటారని ఆమె ఆందోళన చెందుతున్నారు.
సోనియా గాంధీ మాత్రమే కాంగ్రెస్లోని అన్ని వర్గాల నాయకులను కలుపుకుని పని చేయగలరు. మిగతా నాయకులకు ఈ సామర్థ్యం లేదని ఆమె అభిప్రాయపడుతున్నారు. షీలాదీక్షిత్ కుమారుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ ఇటీవల పత్రికల వారితో మాట్లాడుతూ సోనియా గాంధీ నాయకత్వం కొనసాగవలసిందేనని సూచించారు. రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవటంతో ఆయనను వ్యతిరేకించే వర్గం నాయకులు ఇప్పుడు మరింత ధైర్యంగా సోనియా గాంధీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టే అంశంపై కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. సీనియర్ నాయకులు, పార్టీకి చెందిన మెజారిటీ ఎంపీలు, పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కూడా సోనియా గాంధీ నాయకత్వం పట్లే మొగ్గు చూపుతున్నారు తప్ప రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థించటం లేదు.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ బుధవారం స్వదేశం వస్తున్నారని, ఎన్డిఏ ప్రభుత్వం అమలు చేస్తున్న భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించేందుకు యుపిఏ ఆదివారం రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన రైతుల ర్యాలీలో ప్రసంగిస్తారని ఎఐసిసి వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే అంశంపై ఒక స్పష్టత వస్తుందని ఆ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి రాహుల్ వ్యవహారంపై కాంగ్రెస్ నుండే వ్యతిరేకత వస్తోంది. పార్టీ పగ్గాలను చేపట్టి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ఇప్పుడు తన కుమార రత్నంను ఎలా కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకువెళుతుందో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more