రాజకీయా నాయకులు మీడియా అంటే ఎంత ప్రేమో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. అయితే మీడియా ముందు ఎలా మాట్లాడాలి.. ఎలా వ్యవహరించాలని మన వాళ్లు కోచింగ్ సెంటర్ పెడితే కనీసం సీటు కూడా దొరకదేమో. ఎందుకంటే మీడియాను మ్యానేజ్ చెయ్యడం రాజకీయ నాయకులకు వచ్చినంతగా ఎవరికీ రాదు అన్నది అందరికి తెలిసిన నిజం. అయితే చావు రాజకీయాలే ప్రస్తుతం అందరి నుండి విమర్శలు ఎదుర్కొంటున్నాయి. తెలంగాణ లో జరిగిన ఎన్ కౌంటర్ వ్యవహారం మీడియా ముందు బిల్డప్ గా మారింది. మీడియాను చూడగానే నేతలు తెగ నటించేస్తున్నారు కాదు కాదు ఏకంగా జీవించేస్తున్నారు.
తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్లలో పలువురు పోలీసులు మృతి చెందారు. విధి నిర్వహణలో వీరులుగా మారిన వారి కుటుంబాలను ఆదుకోవాలని సర్వత్రా వత్తిడి వస్తుంది అది సహజం. అయితే హడావిడిగా మంత్రి మండలిలోని కొంత మంది మంత్రులు హాజరు కావడం.. దానిపై మీడియాలో వార్తలు రావడం టకటకా జరిగిపోయింది. అయితే పోలీసు అమరవీరులకు ఎక్స్ గ్రేషియా పెంపు విషయంపై తెలంగాణ మంత్రివర్యులు తలలు పట్టుకున్నారు. తీవ్రవాదుల హంసాత్మక సంఘటనల్లో మృతిచెందిన పోలీసు కానిస్టేబుల్ కుటుంబాలకు చెల్లించాలనుకుంటున్న నష్ట పరిహారాన్ని రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఇలాంటి సంఘటనల్లో గాయపడిన ఇతరులకు, ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారం ఎంత మొత్తంలో చెల్లించాలనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు హోం మంత్రి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో ఆర్థికశాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సభ్యులుగా ఉండనున్నారు. అయితే తీవ్రవాదాన్ని ఏ దశలోనూ ఉపేక్షించకూడదని, అణిచివేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.
మొత్తానికి అలా నిర్ణయాన్ని ప్రకటించడానికి గంటలకు గంటలు చర్చించారు. అయితే మీడియా లో మాత్రం అమరులైన పోలీసుల గురించి ప్రత్యేకంగా మంత్రి మండలి సమావేశం జరుగుతోంది అంటూ ఏకంగా బ్రేకింగ్ పెట్టేశారు. మంత్రుల సమావేశంలో లోపల నవ్వుకున్న మంత్రులు(లోపల పరస్థితులను బట్టి నవ్వుకొని ఉండవచ్చు) బయటకు రాగానే మీడియాను చూసి.. వెంటనే తమ హావభావాలను మార్చుకున్నారు. విచన్న వదనాలతో కనిపిస్తూ.. పోలీసు అమరుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పి.. చివరకు ఎక్స్ గ్రేషియా విషయాన్ని వెల్లడించారు. పోలీసుల త్యాగాలను కూడా నేతల ఇలా మీడియా లో హైలెట్ కావడానికి వాడుకోవడం ఏ మాత్రం స్వాగతించకూదని విషయం.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more