జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం... అంటూ రజినీ కాంత్ సినిమాలో జీవితం గురించి చెప్పిన నిజాలను జైరాం రమేష్ తప్పకుండా పాటిస్తాను అన్నట్లున్నారు. రజినీ మాటలు అలాంటివి మరి అని మురిసి పోకండి ఎందుకంటే జైరాం రమేష్ మాటలకు కండీషన్స్ అప్లై అని చిన్న స్టార్ గుర్తు ఉంది. ఇంతకీ విషయం ఏంటీ అంటే ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న భూసేకరణ చట్టంపై తమ పోరాటాన్ని ఆపేది లేదని జైరాం రమేష్ స్పష్టం చేశారు. రజినీ మాటలు అర్థమయ్యాయో లేక ఎన్డీయే వైఖరిపై వ్యతిరేకత ఏమో కానీ పోరాటం తప్పదని, తప్పకుండా విజయం తమదే అంటూ జైరాం రమేష్ అంటున్నారు.
యుపిఏ ప్రభుత్వం భూ సేకరణ బిల్లు నుంచి 13 చట్టాలను మినహాయించిందని, ఎన్డీఏ ప్రభుత్వం సవరించిన చట్టంలో వాటిని చేర్చిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఇప్పుడున్న రూపంలో ఈ బిల్లును పార్లమెంటు లోపలా, వెలుపలా వ్యతిరేకించి తీరుతామని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ స్పష్టం చేశారు. ‘యుపిఏ ప్రభుత్వం భూ సేకరణ బిల్లునుంచి 13 చట్టాలను మినహాయించిందని, కొత్త బిల్లులో తాము వాటిని చేర్చినట్లు ప్రధాని మోదీ ఎక్కడో చెప్పినట్లు నేను పత్రికల్లో చూసాను.. అది నూటికి నూరు శాతం తప్పు’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి జైరాం రమేశ్ అన్నారు. ‘ప్రధాని కొత్తగా ఎలాంటి మేలూ చేయలేదు. 2013లో పార్లమెంటు ఆమోదించిన బిల్లులో ఏం చెప్పారో అదే ఆయన చేసారు’ అని అన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే ఏదో ఒకరోజు దానినే జనం నిజమని నమ్ముతారనే వ్యూహం ఒకటి రాజకీయాల్లో ఉందని జైరాం రమేశ్ చెప్పారు. నష్టపరిహారం నాలుగు రెట్లు పెంచడానికి వీలుగా 2014 డిసెంబర్ 31కన్నా ముందే 13 చట్టాల్లో సవరణ చేయడం తప్పనిసరని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పని చేయాలని 2013 నాటి చట్టం చాలా స్పష్టంగా చెబుతోందని అన్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more