న్యాయ వ్యవస్థను దైవంగా, జడ్జిని దేవుడితో సమానంగా సామాన్యుడు భావిస్తూ ఉంటాడని ప్రధాని అంటూ, అందువల్ల ఆత్మవిమర్శ చేసుకోవడానికి దానికి అంతర్గతంగా వ్యవస్థ ఉండాలని, అయితే అది చాలా క్లిష్టమైన పనని అన్నారు. రాజకీయ వర్గాలపైన ఇప్పుడు మీడియాతో పాటుగా ఇతర వ్యవస్థల నిరంతర నిఘా ఉంటోందని మోదీ అంటూ, ‘ప్రజలు మమ్మల్ని గమనిస్తూ ఉంటారు. తప్పు చేస్తే ఏమాత్రం క్షమించరు. అయితే న్యాయ వ్యవస్థకు అలాంటి అవకాశం లేదు. మీరు ఒక వ్యక్తికి మరణ శిక్ష విధిస్తే, ఆ వ్యక్తి న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని అంటాడే తప్ప తీర్పును విమర్శించడు. విమర్శకు అవకాశం లేనప్పుడు మీరే అంచనా చేసుకోవడానికి అంతర్గతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని మోదీ అన్నారు. అలాంటి వ్యవస్థ లేనప్పుడు చిన్నపాటి తప్పు జరిగినా న్యాయ వ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుందని, అది దేశానికి కూడా మంచిది కాదన్నారు. చట్టానికి, రాజ్యాంగానికి అనుగుణంగా తీర్పులు చెప్పడం చాలా సులభం. అయితే భావనలకు అనుగుణంగా తీర్పు చెప్పే విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి అని ఆయన పేర్కొన్నారు.
సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. న్యాయ వ్యవస్థ శక్తివంతంగానేకాక లోపరహితంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని మోదీ స్పష్టం చేశారు. జడ్జిలను దైవంతో సమానంగా చూస్తారని, అంతేకాక న్యాయ వ్యవస్థపై ఎలాంటి విమర్శా చేయడానికి సామాన్యుడు ఇష్టపడడని, అందువల్ల ఆత్మపరిశీలన చేసుకోవడానికి న్యాయవ్యవస్థకు ఒక అంతర్గత వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని ఆదివారం ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు. న్యాయవ్యవస్థ బలమైనదిగా మారేకొద్దీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేందుకు వీలుగా ఎలాంటి లోపమూ లేనిదిగా కూడా తయారు కావాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు.
రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వం తప్పు చేస్తే న్యాయవ్యవస్థ ఆ నష్టాన్ని సరి చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే మీరు తప్పు చేస్తే వ్యవస్థ అంతా సర్వనాశనం అవుతుంది అని మోదీ వ్యాఖ్యానించారు. ఇంతకుముందు గాసిప్ కాలమ్లో సైతం పనికి రాని వార్త ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అవుతోంది. మేమంతా 24 గంటలు నిఘా ఉండే రాజకీయ వర్గంనుంచి వచ్చాం. రాజకీయ నాయకులు ప్రతి ఐదేళ్లకోసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజకీయవర్గమంటే ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. అలాంటి వర్గంనుంచి వచ్చినప్పటికీ మేము మాపై ఎన్నో ఆంక్షలు విధించుకున్నాని రాజకీయ వర్గాలపై నిఘా పెట్టి ఉండే ఎన్నికల కమిషన్, సమాచార హక్కు చట్టం, లోక్పాల్లాంటి వ్యవస్థలను ప్రస్తావించారు. ‘అంతేకాదు వ్యక్తి ఎంత మంచి వాడయినప్పటికీ సంస్థాగత నెట్వర్క్ బాగాలేకుంటే దిగజారిపోయే అవకాశముంటుంది. తల్లిదండ్రులు డబ్బులు లాకర్లలో పెట్టి తాళం వేస్తుంటారు. దొంగలు దోచుకోకుండా ఉండటం కోసం వాళ్లు ఆ పని చేయరు. దొంగలు మొత్తం ఇనప్పెట్టే ఎత్తుకు పోగలరు. తమ పిల్లలు చెడు అలవాట్లకు లోనుకాకుండా ఉండటం కోసమే ఆ పని చేస్తారు. మనకు కూడా ఇది అవసరం’ అని మోదీ చెప్పారు. లోపభూయిష్టమైన చట్టాలే కోర్టుల్లో కేసులు పేరుకు పోవడానికి కారణమని ప్రధాని అంటూ, అందుకే పనికిరాని చట్టాలన్నిటినీ రద్దు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more