నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ముఠాకు చెందిన ఆత్మాహుతి దళాలు దాడి చేసే అవకాశం ఉందంటూ కేంద్ర నిఘా సంస్థలు ఢిల్లీ పోలీసులను హెచ్చరించాయి. గత నెల జమ్మూ, కాశ్మీర్లోని సాంబా ప్రాంతంలో భద్రతా దళాలపై మిలిటెంట్లు దాడి జరిపిన సంఘటనలో చనిపోయిన మిలిటెంట్లలో ఒకరినుంచి కేంద్ర భద్రతా దళాలు ఒక చీటీని కనుగొన్న తర్వాత ఢిల్లీ పోలీసులను ఇంటెలిజన్స్ వర్గాలు ఈమేరకు హెచ్చరించాయి. భద్రతా దళాలు, హతులైన మిలిటెంట్ల జేబు నుంచి ‘వచ్చేసారి మనం ఢిల్లీలో కలుసుకుందాం’ అని రాసి ఉన్న చీటీని స్వాధీనం చేసుకున్నప్పటినుంచి అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర భద్రతా ఏజన్సీలు ఢిల్లీ పోలీసులను హెచ్చరిస్తూనే ఉన్నాయి. గతంలోకూడా ఇలాంటి హెచ్చరికలు చేయడం జరిగింది. భద్రతా దళాలకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ముందుజాగ్రత్త చర్యగా సంబంధిత పోలీసులను అప్రమత్తం చేయడం మామూలే.
‘సాంబా ఆత్మాహుతి దాడి తరహాలో ఢిల్లీలో దాడులు జరపడానికి జైషే మహమ్మద్ పథకాలు వేస్తోంది’ అని కేంద్ర భద్రతా ఏజన్సీలు ఢిల్లీ పోలీసులను హెచ్చరించినట్టు తెలుస్తోంది. గత నెల 19 అర్ధరాత్రి నలుగురు మిలిటెంట్లు జమ్మూలోని సాంబా సెక్టార్లో సరిహద్దులు దాటి మన భూభాగంలోకి చొరబడిన తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒక గ్రూపు స్థానిక పోలీసు స్టేషన్పై దాడి చేసి ఐదుగురిని హతమార్చగా, మరో ముఠాను సైన్యం మట్టుబెట్టడం తెలిసిందే. ఎలాంటి అవాంఛనీయ సంఘటనా జరక్కుండా చూడడానికి తమ పరిధిలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు పంపిన ఆ అడ్వైజరీలో సూచించినట్టు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. దీనికి అనుగుణంగా దేశ రాజధానిలోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద నిఘా పెట్టి ఉంచడంతోపాటు నగరంలోని లాడ్జిలు, లోబడ్జెట్ హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more