గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. ఎన్నికలపై హైకోర్టులో కేసులు సాగుతున్నాయి. కోర్టుతీరును గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. వారంలోపే హైకోర్టు సైతం ఎన్నికలపై స్పష్టత ఇవ్వనుంది. ప్రభుత్వం సైతం ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికలనాటికి హైదరాబాద్లో గణనీయమైన మార్పును చూపించడం ద్వారా అభివృద్ధితో విజయం సాధించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి ఘోరంగా ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీ నాయకత్వం హైదరాబాద్ ఎన్నికలపై ఆసక్తిగా చూస్తోంది. తెలంగాణ వాదంవల్ల తెలంగాణ జిల్లాల్లో పార్టీ పూర్తిగా బలహీనపడినా, గ్రేటర్ పరిధిలో బలంగాఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. హైదరాబాద్ ఎన్నికల్లో తెదేపా తరఫున నారా లోకేశ్ ప్రచారం సాగించనున్నారు. తాను ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, తాను హైదరాబాదీని అంటూ గతంలో ప్రకటించిన లోకేశ్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో విస్తృతంగా పర్యటించనున్నారు. తెలంగాణకు చెందినవారు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు చెందినవారు పెద్దసంఖ్యలో రాజధాని నగరంలో ఉండటంతో టిడిపి, బిజెపి కూటమి ప్రధానంగా వీరిపై దృష్టి సారించారు. సహజంగా నగరంలో బిజెపికి ఉండే పార్టీ శ్రేణులబలంతోపాటు టిడిపితో పొత్తువల్ల రెండుపార్టీలు ప్రయోజనం పొందుతాయని ఆ పార్టీ నేతల అంచనా.
ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీలో నాయకులు ఒకరి మాట మరొకరు వినే పరిస్థితి లేదు. అయితే గల్లీల్లో ఆ పార్టీకి మంచి కార్యకర్తల బలం ఉంది. కె రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం గ్రేటర్ సీటును కైవసం చేసుకునేంత బలం ఆ పార్టీది. నేతల మధ్య తీవ్రస్థాయిలో విబేధాలున్నా, గల్లీస్థాయిలో పట్టున్న కార్యకర్తలు ఆ పార్టీలో ఉన్నారు. ఎంఐఎం పార్టీ ఎప్పటి మాదిరిగానే పాత నగరంపైనే దృష్టి సారించింది. 30నుంచి 40 వార్డుల్లో ఆ పార్టీకి ఎదురులేదు. వార్డుల సంఖ్య 150నుంచి 200కు పెంచినందున ఇప్పుడా పార్టీకి అదే స్థాయిలో వార్డుల పెరిగే అవకాశం ఉంది. ఎంఐఎం, తెరాస ఏకమయ్యాయనే అంశం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని బిజెపి భావిస్తోంది. ఉగ్రవాదుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బిజెపి ప్రచారం ప్రారంభించింది. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో హైదరాబాద్లోని బలంతోనే గెలిచినందున గ్రేటర్ ఎన్నికల్లో తెదేపా, భాజపా కూటమి విజయం సాధిస్తుందని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. మూడునెలల తరువాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందనే అంచనాతో ప్రభుత్వం ఉంది. అందుకే వందరోజుల కోసం నగర అభివృద్ధిపై ఒక ప్రణాళిక ప్రకటించారు. వంద రోజుల్లో సాధించిన అభివృద్ధి వల్ల నగరంలో ఓటర్లపై అధికార పక్షానికి అనుకూలంగా ప్రభావం ఉంటుందని తెరాస భావిస్తోంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more