నల్గొండ జిల్లా జానకీపూర్ ఎన్కౌంటర్లో మృతి చెందిన అస్లాం, జకీర్ సిమి ఉగ్రవాదులేనని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. మధ్యప్రదేశ్ ఖాండ్వా నుంచి వచ్చిన పోలీసులు హతుల మృతదేహాలను, పింగర్ ప్రింట్స్ ను పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్థారణకు వచ్చారని అనురాగ్ శర్మ తెలిపారు.. గతంతో వీరు ఖాండ్వా జైలు నుంచి అస్లాం, జకీర్ తప్పించుకున్నట్లు నిర్థారించారు. కాగా మధ్యప్రదేశ్ పోలీసులు నిర్థారించడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు.
వీరు చొప్పదండిలో బ్యాంకు రాబడీ చేసిన వారు వీరే అని భావిస్తున్నారు. గతంలో రైలులో వచ్చిన సమయంలో వినోద్ టొప్పోది అనే జార్ఖండ్ వ్యక్తిని బెదిరించి అతని నుండి ఓటర్ కార్డు, గుర్తింపు కార్డు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన సిమి కార్యకర్తలు అస్లాం, జకిర్ల జేబులలోని పర్సు, సెల్ ఫోన్లను పోలీసులు గుర్తించారు. వాటిలో వినోద్ను బెదిరించి తీసుకున్న గుర్తింపు కార్డు, ఓటర్ కార్డులు పోలీసులు గుర్తించారని సమాచారం. సైబరాబాద్ పరిధిలో బస్సుల్లో ప్రయాణీకులను బెదిరించి బ్యాంగులు దొంగిలించింది కూడా వీరేనని అనుమానిస్తున్నారు. పది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వీరు బస్సుల్లో తిరుగుతున్నట్లుగా గుర్తించారని తెలుస్తోంది. మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వీరిపై అనేక కేసులు ఉన్నాయని తెలుస్తోంది. 2007లో కేరళలో తీవ్రవాద శిక్షణ కేంద్రాన్ని నిర్వహించారని సమాచారం. 2010లో భోపాల్లో ఓ బంగారు దుకాణంలో చోరీ చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more